ఆడియన్స్ తో కలిసి సినిమా చూసిన హీరోయిన్

నిన్ననే థియేటర్లలోకి వచ్చింది పక్కా కమర్షియల్ సినిమా. ఈ సినిమాను ఆడియన్స్ తో కలిసి చూశానంటోంది హీరోయిన్ రాశిఖన్నా. అయితే తను ఎక్కడ, ఏ షో చూశాననే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. ప్రేక్షకుల మధ్య కూర్చొని తన సినిమా చూడడం ఓ అందమైన అనుభూతి అని మాత్రం చెప్పుకొచ్చింది. “నేను చాలా సినిమాలు ఆడియన్స్ తో పాటు చూస్తుంటాను, ఆడియన్స్ తో సినిమా చూసే అవకాశం వేరే చోట ఉండదు. ఆడియన్స్ తో థియేటర్ లో సినిమా […]

Advertisement
Update: 2022-07-02 07:28 GMT

నిన్ననే థియేటర్లలోకి వచ్చింది పక్కా కమర్షియల్ సినిమా. ఈ సినిమాను ఆడియన్స్ తో కలిసి చూశానంటోంది హీరోయిన్ రాశిఖన్నా. అయితే తను ఎక్కడ, ఏ షో చూశాననే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. ప్రేక్షకుల మధ్య కూర్చొని తన సినిమా చూడడం ఓ అందమైన అనుభూతి అని మాత్రం చెప్పుకొచ్చింది.

“నేను చాలా సినిమాలు ఆడియన్స్ తో పాటు చూస్తుంటాను, ఆడియన్స్ తో సినిమా చూసే అవకాశం వేరే చోట ఉండదు. ఆడియన్స్ తో థియేటర్ లో సినిమా చూసే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ప్రేక్షకులంతా సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. వాళ్లను చూసి నేను ఎంజాయ్ చేశాను.”

ఇలా ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూసిన విషయాన్ని బయటపెట్టింది రాశీఖన్నా. ప్రతి రోజు పండగలో చేసిన ఏంజెలార్న పాత్ర కంటే.. పక్కా కమర్షియల్ సినిమాలో చేసిన లాయర్ ఝాన్సీ పాత్ర తనకు మరింత పేరు తెచ్చిపెట్టిందని చెబుతోంది ఈ బ్యూటీ.

రీసెంట్ గా ఇండస్ట్రీలో 8 ఏళ్లు పూర్తిచేసుకున్న ఈ బ్యూటీ.. తన జర్నీ చాలా సంతృప్తికరంగా సాగుతోందని చెప్పుకొచ్చంది.

Tags:    
Advertisement

Similar News