మరో సినిమా రెడీ చేసిన విజయ్ ఆంటోనీ

విజయ్ ఆంటోనీ మరో సినిమా రెడీ చేశాడు. ఇదొక సీరియస్ క్రైమ్ డ్రామా. సినిమా పేరు దోషి.

Advertisement
Update: 2022-07-25 02:59 GMT

విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న సినిమా "దోషి". మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్య నంబీసన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, జి ధనుంజయన్, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. సీఎస్ అముదన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

క్రైమ్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న దోషి సినిమా ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. ఇప్పటిదాకా చరిత్రలో జరగని క్రైమ్ డ్రామా కథగా ఈ సినిమా ఉండనుంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

తమీజ్ పాడమ్ లాంటి హిలేరియస్ స్పూఫ్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన దర్శకుడు సీఎస్ అముదన్ ఈసారి క్రైమ్ డ్రామా జానర్ లో దోషి చిత్రాన్ని తెరకెక్కించారు. కామెడీ చిత్రాల్లో తమీజ్ పాడమ్ ట్రెండ్ క్రియేట్ చేసినట్టే.. క్రైమ్ జానర్ లో దోషి సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుందని నమ్ముతున్నారు.

జగన్, నిళల్ గల్ రవి, జాన్ మహేంద్రన్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కన్నన్ సంగీతం అందిస్తున్నాడు. విజయ్ ఆంటోనీ గత చిత్రాల టైపులోనే ఈ మూవీ కూడా సీరియస్ గా సాగనుంది. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పటికీ, సాంగ్స్ ఉండవని తెలుస్తోంది. 

Tags:    
Advertisement

Similar News