బీజేపీని ఓడించే సత్తా వారికి లేదు -అసదుద్దీన్ ఒవైసీ

ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో రెండు సీట్లు బీజేపీ గెల్చుకున్న నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీకి బీజేపీని ఓడించే సత్తా లేదని ఆయన అన్నారు. బీజేపీకి బీ టీం, సీ టీం అని మమ్ములను అన్న వాళ్ళు ఇప్పుడు చెప్పండి ఎవరు బీ టీం? ఎవరు సీ టీం ? అని అఖిలేష్ యాదవ్ ను ఆయన ప్రశ్నించారు. సమాజ్ వాదీ పార్టీకి నిజాయితీ […]

Advertisement
Update: 2022-06-26 22:26 GMT

ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో రెండు సీట్లు బీజేపీ గెల్చుకున్న నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీకి బీజేపీని ఓడించే సత్తా లేదని ఆయన అన్నారు.

బీజేపీకి బీ టీం, సీ టీం అని మమ్ములను అన్న వాళ్ళు ఇప్పుడు చెప్పండి ఎవరు బీ టీం? ఎవరు సీ టీం ? అని అఖిలేష్ యాదవ్ ను ఆయన ప్రశ్నించారు. సమాజ్ వాదీ పార్టీకి నిజాయితీ లేదని ఇటువంటి పార్టీలకు మైనార్టీలు ఓట్లు వేయడం మానేయండి అని అసదుద్దీన్ పిలుపునిచ్చారు.

రాంపూర్‌, ఆజాంఘడ్‌ ఉప ఎన్నికల్లో ఓటమికి ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవే పూర్తి బాధ్యుడని, ఆయన అహంభావి, ప్ర‌జలను కలిసే ఓపిక కూడా ఆయనకు లేదు అని ఆయన విమర్షించారు.

Tags:    
Advertisement

Similar News