చిరంజీవి ఆఫర్ ముందుగా నాకే వచ్చింది

కడువా సినిమాతో మలయాలంతో పాటు టాలీవుడ్ లో కూడా ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు హీరో పృధ్విరాజ్. తొలి సారి తన సినిమా ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన ఈ నటుడు.. కొన్ని ఆసక్తికర విషయాల్ని మీడియాతో పంచుకున్నాడు. మరీ ముఖ్యంగా లూసిఫర్ రీమేక్ ను డైరక్ట్ చేసే అవకాశం ముందుగా తనకే వచ్చిందనే విషయాన్ని బయటపెట్టాడు. “అందరిలానే నేనూ చిరంజీవి గారికి అభిమానిని. లూసిఫర్ రీమేక్ చేయమని అడిగారు. కానీ అప్పటికి వేరే సినిమాతో బిజీగా ఉండి […]

Advertisement
Update: 2022-06-26 00:58 GMT

కడువా సినిమాతో మలయాలంతో పాటు టాలీవుడ్ లో కూడా ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు హీరో పృధ్విరాజ్. తొలి సారి తన సినిమా ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన ఈ నటుడు.. కొన్ని ఆసక్తికర విషయాల్ని మీడియాతో పంచుకున్నాడు. మరీ ముఖ్యంగా లూసిఫర్ రీమేక్ ను డైరక్ట్ చేసే అవకాశం ముందుగా తనకే వచ్చిందనే విషయాన్ని బయటపెట్టాడు.

“అందరిలానే నేనూ చిరంజీవి గారికి అభిమానిని. లూసిఫర్ రీమేక్ చేయమని అడిగారు. కానీ అప్పటికి వేరే సినిమాతో బిజీగా ఉండి కుదరలేదు. అంతకుముందు సైరా నరసింహ రెడ్డిలో కూడా ఒక పాత్ర చేయమని కోరారు. అప్పుడు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన వీలుపడలేదు. చిరంజీవి గారితో పని చేయాలని ఉంది. లూసిఫర్ 2 చేస్తున్నా. ఒకవేళ దీని రీమేక్ కి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తా.”

ఇలా లూసిఫర్ రీమేక్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ ముందుగా తనకే వచ్చిందనే విషయాన్ని పృధ్విరాజ్ బయటపెట్టాడు. అంతేకాదు.. ఈ సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ మేటర్ కూడా బయటపెట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సలార్ మూవీ ఛాన్స్ కూడా ఇతడికే వచ్చిందంట. ఆ టైమ్ లో ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల సలార్ చేయలేకపోయానని తెలిపాడు. సలార్ కథ పూర్తిగా తనకు తెలుసని, ప్రభాస్ సలార్ గా సరిగ్గా సరిపోతాడని అన్నాడు.

Tags:    
Advertisement

Similar News