‘పరిహారం’ పై బీజేపీ, టీఆర్ఎస్ సవాళ్లు... మధ్యలో ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి
హైదరాబాద్ వరద బాధితుల పరిహారంపై బీజేపీ.. టీఆర్ఎస్ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నాయి. పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 10 వేల పరిహారం ఇస్తుంటే.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల కమిషన్కు లేఖ రాసి పరిహారం నిలిచిపోయేలా చేశారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. బండి సంజయ్ రాసిన లేఖ ఇదేనంటూ టీఆర్ఎస్ ఓ లేఖను కూడా విడుదల చేసింది. అయితే ఈ అంశంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఆ లేఖ తాను రాయలేదని.. […]
హైదరాబాద్ వరద బాధితుల పరిహారంపై బీజేపీ.. టీఆర్ఎస్ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నాయి. పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 10 వేల పరిహారం ఇస్తుంటే.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల కమిషన్కు లేఖ రాసి పరిహారం నిలిచిపోయేలా చేశారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. బండి సంజయ్ రాసిన లేఖ ఇదేనంటూ టీఆర్ఎస్ ఓ లేఖను కూడా విడుదల చేసింది. అయితే ఈ అంశంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఆ లేఖ తాను రాయలేదని.. తన సంతకం ఫోర్జరీ చేశారని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ లేఖ తాను రాయలేదని ఛార్మినార్ పక్కన ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తానని.. దమ్ముంటే కేసీఆర్ భాగ్యలక్ష్మి టెంపుల్కు రావాలంటూ సవాల్ విసిరారు. ఈ సవాళ్లు.. ప్రతిసవాళ్లు ఇలా కొనసాగుతుండగానే మధ్యలోకి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి ఎంట్రీ ఇచ్చారు.
అసలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పేదలకు పరిహారం ఇచ్చే ఉద్దేశ్యం లేదని.. కావాలనే ఎన్నికల ముందు పరిహారం అంటూ డ్రామా నడిపిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఫేస్బుక్ వేదికగా ఆమె విమర్శలు గుప్పించారు. ‘జీహెచ్ఎంసీ ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ వరదసాయం విడుదల చేశారు. ముందు చేపట్టిన రూ. 10 వేల పంపిణీలో అవినీతి జరిగింది. ఆ సొమ్మును కార్యకర్తలు, టీఆర్ఎస్ చోటామోటా నాయకులు బొక్కేశారు. వరదసాయం అందలేదని ప్రజలు తిరగబడటంతో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందే వరదసాయం అంటూ డ్రామా ఆడారు. ఓ మహిళ సాయం డబ్బుల కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోయింది.
ఓటర్లు కేసీఆర్ దొరగారి కుట్రను అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్ళు కాదు’ అని విజయశాంతి ఆరోపణలు చేశారు.