ప్రతిపక్షాల తీరు చూస్తుంటే కుట్ర ఉందనిపిస్తోంది " హోంమంత్రి

అంతర్వేది రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగించింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన జీవోను శుక్రవారం విడుదల చేసింది ప్రభుత్వం. ఈ సందర్భంగా ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసును సీబీఐకి అప్పగించామని, పూర్తి వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. రథం దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు తమకూ కలుగుతున్నాయన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాల స్పందన చూసినా, వారుచేస్తున్న విమర్శలు చూసినా ఈ ఘటన వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయని […]

Advertisement
Update: 2020-09-11 02:10 GMT

అంతర్వేది రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగించింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన జీవోను శుక్రవారం విడుదల చేసింది ప్రభుత్వం. ఈ సందర్భంగా ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసును సీబీఐకి అప్పగించామని, పూర్తి వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.

రథం దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు తమకూ కలుగుతున్నాయన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాల స్పందన చూసినా, వారుచేస్తున్న విమర్శలు చూసినా ఈ ఘటన వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయని హోంమంత్రి వ్యాఖ్యానించారు.

Advertisement

Similar News