విడాకులు తీసుకున్న హీరోయిన్

నటి ఎస్తేర్ విడాకులు తీసుకుంది. సింగర్ నోయెల్ తో తనకిక ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా ప్రకటించింది. ఫ్యామిలీ కోర్టు నిన్న తామిద్దరికీ విడాకులు మంజూరు చేసినట్టు తెలిపింది ఎస్తేర్. తెలుగులో వెయ్యి అబద్ధాలు సినిమాలతో హీరోయిన్ గా పరిచయమైంది ఎస్తేర్. ఆ తర్వాత సునీల్ సరసన భీమవరం బుల్లోడు సినిమా చేసింది. గరం, జయజానకి నాయక లాంటి సినిమాల్లో కూడా నటించింది. అదే టైమ్ లో సింగర్ నోయలో తో పరిచయం అవ్వడం, అది ప్రేమగా […]

Advertisement
Update: 2020-09-01 03:33 GMT

నటి ఎస్తేర్ విడాకులు తీసుకుంది. సింగర్ నోయెల్ తో తనకిక ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా ప్రకటించింది. ఫ్యామిలీ కోర్టు నిన్న తామిద్దరికీ విడాకులు మంజూరు చేసినట్టు తెలిపింది ఎస్తేర్.

తెలుగులో వెయ్యి అబద్ధాలు సినిమాలతో హీరోయిన్ గా పరిచయమైంది ఎస్తేర్. ఆ తర్వాత సునీల్ సరసన భీమవరం బుల్లోడు సినిమా చేసింది. గరం, జయజానకి నాయక లాంటి సినిమాల్లో కూడా నటించింది. అదే టైమ్ లో సింగర్ నోయలో తో పరిచయం అవ్వడం, అది ప్రేమగా మారడం, ఇద్దరూ పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.

అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే తమ మధ్య అభిప్రాయబేధాలు, సర్దుబాటు సమస్యలు తలెత్తాయని ఎస్తేర్ వివరించింది. అలా పెళ్లయిన 5 నెలలకే విడాకులకు దరఖాస్తు చేస్తున్నామని, అవి నిన్న మంజూరయ్యాయని వెల్లడించింది ఎస్తేర్.

Advertisement

Similar News