లంకా దినకర్ లీకు వీరుడా?... బీజేపీ షోకాజ్ నోటీసు

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంక దినకర్‌కు ఆ పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ అంతర్గత వివరాలు టీడీపీ నేతలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నుంచి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అధికార ప్రతినిధులెవరూ టీవీ చర్చల్లో పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా లంకా దినకర్, మరికొందరు నేతలు పలు చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని కూడా బీజేపీ […]

Advertisement
Update: 2020-07-28 00:58 GMT

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంక దినకర్‌కు ఆ పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ అంతర్గత వివరాలు టీడీపీ నేతలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆయన నుంచి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అధికార ప్రతినిధులెవరూ టీవీ చర్చల్లో పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా లంకా దినకర్, మరికొందరు నేతలు పలు చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని కూడా బీజేపీ సీరియస్‌గా తీసుకుంది.

ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారి నుంచే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో లంకా దినకర్‌తో పాటు మరికొందరికి నోటీసులు జారీ చేసింది బీజేపీ. పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలకు చెక్‌ పెట్టాలని బీజేపీ భావిస్తోంది.

Tags:    
Advertisement

Similar News