మహేష్ నుంచి 2 సినిమాల ప్రకటన

మహేష్ తన నెక్ట్స్ సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ప్రాజెక్టును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాలనేది ప్లాన్. అయితే అదే రోజున మహేష్ బాబు తన నుంచి మరో సినిమాను కూడా ప్రకటించబోతున్నాడట. అవును.. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చేయడంతో.. ఆ రోజున ఒకేసారి 2 ప్రాజెక్టులు ప్రకటించాలనే ఆలోచనలో మహేష్ ఉన్నాడట. అయితే […]

Advertisement
Update: 2020-05-08 22:05 GMT

మహేష్ తన నెక్ట్స్ సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ప్రాజెక్టును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాలనేది ప్లాన్. అయితే అదే రోజున మహేష్ బాబు తన నుంచి మరో సినిమాను కూడా ప్రకటించబోతున్నాడట.

అవును.. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చేయడంతో.. ఆ రోజున ఒకేసారి 2 ప్రాజెక్టులు ప్రకటించాలనే ఆలోచనలో మహేష్ ఉన్నాడట. అయితే ఆ రెండో సినిమా ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. మొన్నటివరకు దర్శకుడు వంశీ పైడిపల్లితో కథాచర్చలు సాగించి, ఆఖరి నిమిషంలో ఆ ప్రాజెక్టును పక్కనపెట్టి పరశురామ్ కు అవకాశం ఇచ్చాడు మహేష్.

సో.. 31న పరశురామ్ సినిమాతో పాటు వంశీ పైడిపల్లితో ప్రాజెక్టును కూడా ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు చాలామంది. మరికొంతమంది మాత్రం సందీప్ రెడ్డి వంగ పేరు చెబుతున్నారు. రీసెంట్ గా మహేష్-సందీప్ మధ్య కూడా స్టోరీ డిస్కషన్లు జరిగాయి. మహేష్ తో సినిమా చేస్తానని గతంలో సందీప్ కూడా ప్రకటించాడు. సో.. వంశీపైడిపల్లి, సందీప్ వంగలో మహేష్ ఎవరికి ఛాన్స్ ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    
Advertisement

Similar News