100 కోట్లు పోగొట్టుకున్నా... పవన్ తో 3 సినిమాలు చేయాల్సింది

పూరి జగన్నాథ్.. డ్యాషింగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పేరుంది. ఆయన టేకింగ్, కథ యమ స్పీడుగా తెరపై పరిగెత్తు తుంటాయి. అంతటి స్పీడున్న దర్శకుడు టాలీవుడ్ లోకి వచ్చి 20 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా అందరూ ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పుకున్నాడు. టాలీవుడ్ లో తాను సంపాదించినంత డబ్బు ఎవరూ సంపాదించలేదని.. దాదాపు 100 కోట్లు స్నేహితులను నమ్మి మోసపోయానని […]

Advertisement
Update: 2020-04-20 06:33 GMT

పూరి జగన్నాథ్.. డ్యాషింగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పేరుంది. ఆయన టేకింగ్, కథ యమ స్పీడుగా తెరపై పరిగెత్తు తుంటాయి. అంతటి స్పీడున్న దర్శకుడు టాలీవుడ్ లోకి వచ్చి 20 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా అందరూ ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పుకున్నాడు. టాలీవుడ్ లో తాను సంపాదించినంత డబ్బు ఎవరూ సంపాదించలేదని.. దాదాపు 100 కోట్లు స్నేహితులను నమ్మి మోసపోయానని తెలిపారు. వారు నన్ను వెన్నుపోటు పొడిచారని పూరి జగన్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సినిమాలు చేయడం తప్పితే.. వ్యాపారం చేయడం రాదని.. అందుకే మోసపోయానని పూరి తెలిపారు.

ఇక తాను 3 సినిమాలు పవన్ కళ్యాణ్ తో చేయాల్సి ఉందని.. మిస్ అయ్యిందని పూరి తెలిపారు. ‘ఇడియట్’, ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ ‘పోకిరి’ కథలు విని బాగున్నాయన్నారు… కానీ చేయలేదని పూరి జగన్నాథ్ సంచలన విషయాలు వెల్లడించారు. అవి రవితేజ, మహేష్ బాబుకు లైఫ్ ఇచ్చాయన్నారు.

ఒకప్పుడు కష్టాలతో నాకు ఉన్న ఇల్లును అమ్మేయాల్సి వచ్చిందని.. ఆ తర్వాత డబ్బును సంపాదించి మళ్లీ కట్టుకున్నానని పూరి జగన్నాథ్ తెలిపారు. 20 ఇయర్స్ ఇండస్ట్రీ సందర్భంగా ఆయన పడిన కష్టాలు, కన్నీళ్లను నెమరు వేసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News