మెగా బాంబ్ పేల్చిన చిరంజీవి

చిరంజీవి ఓ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశారంటే అభిమానులకు పండగ. అంతేకాదు.. ఆ ప్రాజెక్టు చుట్టూ చాలా బజ్, మరెంతో మార్కెట్ క్రియేట్ అవుతుంది. చిరు స్టామినా అది. కానీ ఫస్ట్ టైమ్ చిరంజీవి ఎనౌన్స్ చేసిన ఓ ప్రాజెక్ట్ విని మెగాభిమానులు షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఒకటే ఏడుపు. అవును.. మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా ఎనౌన్స్ చేశాడు చిరంజీవి. నిజంగా ఇది మెగాభిమానులకే కాదు, అందరికీ షాక్. ఎన్టీఆర్ కు శక్తి లాంటి డిజాస్టర్, […]

Advertisement
Update: 2020-04-20 07:00 GMT

చిరంజీవి ఓ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశారంటే అభిమానులకు పండగ. అంతేకాదు.. ఆ ప్రాజెక్టు చుట్టూ చాలా బజ్, మరెంతో మార్కెట్ క్రియేట్ అవుతుంది. చిరు స్టామినా అది. కానీ ఫస్ట్ టైమ్ చిరంజీవి ఎనౌన్స్ చేసిన ఓ ప్రాజెక్ట్ విని మెగాభిమానులు షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఒకటే ఏడుపు.

అవును.. మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా ఎనౌన్స్ చేశాడు చిరంజీవి. నిజంగా ఇది మెగాభిమానులకే కాదు, అందరికీ షాక్. ఎన్టీఆర్ కు శక్తి లాంటి డిజాస్టర్, వెంకటేష్ కు షాడో లాంటి డిజాస్టర్ ను అందించాడు మెహర్ రమేష్. ఈ దెబ్బతో అతడికి సినిమా అవకాశాలే రాకుండా పోయాయి.

ఇలాంటి దర్శకుడితో సినిమా చేస్తానని ప్రకటించి అందరికీ షాకిచ్చారు చిరు. ఓ ఛానెల్ తో మాట్లాడిన మెగాస్టార్.. ఆచార్య తర్వాత సుజీత్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత లిస్ట్ లో బాబి, మెహర్ రమేష్ ఉన్నారని ప్రకటించి అందరికీ షాకిచ్చారు.

Tags:    
Advertisement

Similar News