స్టార్ హీరోలను రాజమౌళి బ్యాలెన్స్ చేశాడా?

బాహుబలి తర్వాత జక్కన్న రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. రాంచరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగణ్, ఆలియా భట్ లు నటిస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు రాంచరణ్ ను అల్లూరి సీతారామరాజుగా ఘనంగా చూపించిన రాజమౌళి.. అంతటి ప్రాధాన్యత కొమురం భీం పాత్రధారి ఎన్టీఆర్ కు ఇచ్చాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఈ ఇద్దరు అగ్రహీరోలను రాజమౌళి సమతుల్యం చేశాడా? అన్నది అభిమానుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఇటీవల […]

Advertisement
Update: 2020-04-14 02:13 GMT

బాహుబలి తర్వాత జక్కన్న రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. రాంచరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగణ్, ఆలియా భట్ లు నటిస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అయితే ఇప్పటివరకు రాంచరణ్ ను అల్లూరి సీతారామరాజుగా ఘనంగా చూపించిన రాజమౌళి.. అంతటి ప్రాధాన్యత కొమురం భీం పాత్రధారి ఎన్టీఆర్ కు ఇచ్చాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఈ ఇద్దరు అగ్రహీరోలను రాజమౌళి సమతుల్యం చేశాడా? అన్నది అభిమానుల్లో ఆందోళనకు కారణమవుతోంది.

ఇటీవల ఇంటర్వ్యూలో రాజమౌళిని ఇదే విషయం అడిగినప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలకు సమాన ప్రాముఖ్యత ఉంటుందని.. స్క్రీన్ ప్రెజెన్స్ లో ఇద్దరూ కీలకమని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

అయితే బాహుబలి కంటే ఈ ఆర్ఆర్ఆర్ మూవీ నిడివి ఎక్కువని.. ఇద్దరు హీరోలను సంతృప్తి పరచడానికి పెంచారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు.

ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ విడుదలైతే కానీ ఎన్టీఆర్ కు సినిమాలో రాంచరణ్ అంతటి ప్రాధాన్యత దక్కిందా.. లేదా.. అన్నది తెలియదు.

Tags:    
Advertisement

Similar News