కరోనా కష్టాలు: బ్రేక్ ఫాస్ట్ గా గడ్డితింటున్న సల్మాన్ ఖాన్

‘తినగ తినగ వేము తియ్యనుండు ’ అని వేమన కవి ఎప్పుడో చెప్పాడు. కానీ ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కరోనా టైంలో కష్టాలు పడుతున్నాడు. కరోనాతో లాక్ డౌన్ విధిస్తారని తెలియక తన ఫాంహౌస్ కు మేనల్లుడు, కొందరుతో వచ్చాడు. లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడే చిక్కుకొని పోయాడు. ఎప్పుడూ పార్టీలు, ఫంక్షన్లు, షూటింగ్స్, కార్యక్రమాలతో బిజీగా ఉండే సల్మాన్ ఖాన్ గడిచిన 15రోజులుగా తన వ్యవసాయ క్షేత్రంలోనే చిక్కుకొని […]

Advertisement
Update: 2020-04-11 06:05 GMT

‘తినగ తినగ వేము తియ్యనుండు ’ అని వేమన కవి ఎప్పుడో చెప్పాడు. కానీ ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కరోనా టైంలో కష్టాలు పడుతున్నాడు. కరోనాతో లాక్ డౌన్ విధిస్తారని తెలియక తన ఫాంహౌస్ కు మేనల్లుడు, కొందరుతో వచ్చాడు. లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడే చిక్కుకొని పోయాడు.

ఎప్పుడూ పార్టీలు, ఫంక్షన్లు, షూటింగ్స్, కార్యక్రమాలతో బిజీగా ఉండే సల్మాన్ ఖాన్ గడిచిన 15రోజులుగా తన వ్యవసాయ క్షేత్రంలోనే చిక్కుకొని పోయాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక పిచ్చెక్కినట్టు అనిపిస్తోందని కొన్ని సరదా వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

తన వ్యవసాయ క్షేత్రంలోని పెంపుడు జంతువులతో ఆడుకుంటూ వాటికి ఆహారం అందిస్తూ గడిపేస్తున్నాడు. తాజాగా గుర్రానికి గడ్డి వేస్తూ ఆ గడ్డి తను కూడా తింటూ కరోనా వేళ ఇదే నా బ్రేక్ ఫాస్ట్ అని సల్మాన్ ఖాన్‘గడ్డి తింటున్న వీడియో ను షేర్ చేశాడు..అదిప్పుడు వైరల్ గా మారింది.

ఇలా సల్మాన్ ఖాన్ అంతటి అగ్రహీరో కూడా లాక్ డౌన్ తో వ్యవసాయ క్షేత్రంలో చిక్కుకొని పోవడం.. కష్టాలు పడుతుండడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Tags:    
Advertisement

Similar News