పవన్ రీఎంట్రీ షురూ

సినిమాలు చేయనని గతంలో పదేపదే ప్రకటించిన పవన్ కల్యాణ్, మరోసారి ముఖానికి రంగేసుకున్నారు. ఎంచక్కా కెమెరా ముందు వాలిపోయారు. ఇవాళ్టి నుంచి లొకేషన్ కు కూడా వచ్చేశారు. పవన్ హీరోగా పింక్ తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సికింద్రాబాద్ అల్వాల్ లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళ్లే సన్నివేశాలు తీశారు. మొదటి షెడ్యూల్, మొదటి రోజు షూటింగ్ కే లీకులు మొదలయ్యాయి. సెట్స్ లో పవన్ కల్యాణ్ […]

Advertisement
Update: 2020-01-20 10:21 GMT

సినిమాలు చేయనని గతంలో పదేపదే ప్రకటించిన పవన్ కల్యాణ్, మరోసారి ముఖానికి రంగేసుకున్నారు. ఎంచక్కా కెమెరా ముందు వాలిపోయారు. ఇవాళ్టి నుంచి లొకేషన్ కు కూడా వచ్చేశారు.

పవన్ హీరోగా పింక్ తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సికింద్రాబాద్ అల్వాల్ లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళ్లే సన్నివేశాలు తీశారు. మొదటి షెడ్యూల్, మొదటి రోజు షూటింగ్ కే లీకులు మొదలయ్యాయి. సెట్స్ లో పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళ్లే స్టిల్ లీక్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ స్టిల్ వైరల్ అవుతోంది.

నిజానికి పవన్ లేకుండానే ఇవాళ్టి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ అనుకోని విధంగా తను షూటింగ్ కు వస్తానని పవన్ ప్రకటించారు. అయితే పొద్దున్న పొలిటికల్ మీటింగ్స్ చూసుకొని మధ్యాహ్నం నుంచి వస్తానన్నారు. తర్వాత మనసు మార్చుకొని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కాల్షీట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ మనసు మార్చుకొని ఉదయం 7 గంటలకే లొకేషన్ కు వచ్చేస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే ఉదయం 7 గంటల నుంచే షూట్ మొదలైంది.

ఈ సినిమాకు సంబంధించి అన్నపూర్ణ ఏడెకరాల్లో భారీ కోర్టు హాల్ సెట్ వేశారు. ఆ సెట్ లో త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఒరిజినల్ పింక్ సినిమాలో తాప్సి పోషించిన పాత్రను, తెలుగు రీమేక్ లో నివేత థామస్ పోషిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో అనన్య, అంజలి కనిపిస్తున్నారు. ఇవాళ్టి సెట్స్ లో నివేత కూడా కనిపించింది.

Tags:    
Advertisement

Similar News