పోలీసుల అదుపులో పేకాటరాణుల ముఠా

గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేకాట రాణుల ముఠా పోలీసులకు పట్టుబడింది. పట్టణంలోని మహానాడు పట్టాభిరామయ్య కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 8 మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. చుట్టుపక్కల వారు ఇచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. భారీగా డబ్బు పెట్టి పేకాట ఆడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వారి నుంచి లక్షా 36వేల నగదు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది పైనా కేసు నమోదు చేశారు. చాలాకాలంగా ఈ ఇంట్లో […]

Advertisement
Update: 2019-11-25 05:17 GMT

గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేకాట రాణుల ముఠా పోలీసులకు పట్టుబడింది. పట్టణంలోని మహానాడు పట్టాభిరామయ్య కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 8 మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. చుట్టుపక్కల వారు ఇచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు.

భారీగా డబ్బు పెట్టి పేకాట ఆడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వారి నుంచి లక్షా 36వేల నగదు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది పైనా కేసు నమోదు చేశారు. చాలాకాలంగా ఈ ఇంట్లో పేకాట ఆడుతున్నట్టు విచారణలో తేలింది.

ఇప్పటి వరకు పురుషులే ఈ ఆటకు బానిసలవుతుండగా… ఇటీవల మహిళలు కూడా ఈ జూదానికి దాసోహం అవుతున్నారని …. ఇలాంటి ఉదంతాలు తరుచూ వెలుగు చూస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News