యువతి పై కత్తితో దాడి చేశాడు... ఆ తరువాత పురుగుల మందు తాగాడు...

మహిళలపై వేధింపులు, దాడులు ఆపడానికి ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఉన్మాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రేమ పేరుతో వెంటపడటం.. కాదంటే ప్రాణాలు తీయడం సర్వసాధారణంగా మారింది. ఇలాంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన సుధాకర్‌కు గతంలోనే పెళ్లైంది. కాని భార్యతో గొడవలు పడుతూ విడాకుల కోసం ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో అతను గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నానంటూ గత కొంత కాలంగా వెంటపడుతున్నాడు. సుధాకర్ […]

Advertisement
Update: 2019-10-16 03:26 GMT

మహిళలపై వేధింపులు, దాడులు ఆపడానికి ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఉన్మాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రేమ పేరుతో వెంటపడటం.. కాదంటే ప్రాణాలు తీయడం సర్వసాధారణంగా మారింది. ఇలాంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన సుధాకర్‌కు గతంలోనే పెళ్లైంది. కాని భార్యతో గొడవలు పడుతూ విడాకుల కోసం ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో అతను గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నానంటూ గత కొంత కాలంగా వెంటపడుతున్నాడు. సుధాకర్ గురించి తెలిసిన ఆ యువతి అతడి ప్రేమను తిరస్కరించడమే కాక.. ఈ సారి వెంటపడితే పెద్దలకు చెబుతానని బెదిరించింది.

యువతి ప్రేమించకపోవడమే కాక బెదిరించడంతో కక్ష పెంచుకున్న సుధాకర్ ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు. దీంతో ఇవాళ ఉదయం యువతి కళాశాలకు వెళ్లడానికి బస్టాప్‌లో వేచి ఉండగా కత్తితో దారుణంగా నరికాడు. దీంతో యువతి అక్కడికక్కడే కుప్పకూలింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

కాగా, హత్యాయత్నం అనంతరం సుధాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించగా.. వాళ్లు ఆసుపత్రికి తరలించారు. ఇతడిని పాలకొల్లు ఆసుపత్రికి తరలించగా వైద్యులు విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News