ద్రోణంరాజుకు పదవి

సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌కు వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొన్నటి ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన ద్రోణంరాజు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. విశాఖ పరిధిలో వైసీపీ మొన్నటి ఎన్నికల్లో ఏమాత్రం మంచి ఫలితాలు సాధించలేదు. త్వరలోనే జరిగే విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితిని […]

Advertisement
Update: 2019-07-13 04:15 GMT

సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌కు వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మొన్నటి ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన ద్రోణంరాజు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

విశాఖ పరిధిలో వైసీపీ మొన్నటి ఎన్నికల్లో ఏమాత్రం మంచి ఫలితాలు సాధించలేదు. త్వరలోనే జరిగే విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితిని మెరుగుపరచాల్సి ఉంటుందన్న ఉద్దేశంతోనే ద్రోణంరాజుకు పదవి ఇచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News