కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.... 25 మంది మృతి

కశ్మీర్‌లోని షోఫియాన్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే అదే రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో పడిన ఈ ఘటనలో 25 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు ప్రమాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కశ్మీర్‌లోని కేశ్వాన్ నుంచి కిష్త్వార్ వెళ్తున్న ఒక మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. రోడ్డు నుంచి చాలా లోతులో పడిపోవడంతో 25 మంది అక్కడికక్కడే చనిపోయినట్లు […]

Advertisement
Update: 2019-06-30 23:05 GMT

కశ్మీర్‌లోని షోఫియాన్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే అదే రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో పడిన ఈ ఘటనలో 25 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు ప్రమాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

కశ్మీర్‌లోని కేశ్వాన్ నుంచి కిష్త్వార్ వెళ్తున్న ఒక మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. రోడ్డు నుంచి చాలా లోతులో పడిపోవడంతో 25 మంది అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉందని.. మృతుల సంఖ్య మరింతగా పెరుగుతుందని పోలీసులు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News