తల్లి విడాకులపై స్పందించిన సాయి ధరమ్ తేజ్

సాయి ధరంతేజ్ మెగాస్టార్ చిరంజీవి చెల్లెలైన విజయదుర్గ పెద్దకొడుకు అని అందరికీ తెలిసిన విషయమే. కానీ విజయదుర్గ తన భర్తతో విడాకులు తీసుకున్న విషయం మాత్రం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. సాయిధరమ్ తేజ్ మరియు అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ లను సింగిల్ పేరెంట్ గా పెంచిన విజయదుర్గ కొంత కాలం కిందటే రెండవ పెళ్లి చేసుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సాయి ధరమ్ తేజ్ తన తల్లిదండ్రుల విడాకుల గురించి రియాక్ట్ అయ్యాడు. […]

Advertisement
Update: 2019-04-23 23:27 GMT

సాయి ధరంతేజ్ మెగాస్టార్ చిరంజీవి చెల్లెలైన విజయదుర్గ పెద్దకొడుకు అని అందరికీ తెలిసిన విషయమే. కానీ విజయదుర్గ తన భర్తతో విడాకులు తీసుకున్న విషయం మాత్రం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.

సాయిధరమ్ తేజ్ మరియు అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ లను సింగిల్ పేరెంట్ గా పెంచిన విజయదుర్గ కొంత కాలం కిందటే రెండవ పెళ్లి చేసుకుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సాయి ధరమ్ తేజ్ తన తల్లిదండ్రుల విడాకుల గురించి రియాక్ట్ అయ్యాడు. దాదాపు 15 ఏళ్ల క్రితమే తన తల్లిదండ్రులు విడిపోయారని…. అప్పటినుంచి తనని, తన తమ్ముడిని కేవలం వాళ్ళ అమ్మనే పెంచారని చెప్పిన సాయి ధరంతేజ్…. తాను ఇప్పటికీ తన తండ్రితో అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పాడు. అయితే తమకు తండ్రి లేని లోటు తెలియకుండా పెంచిందని చెప్పుకొచ్చాడు తేజ్.

“ఎవరికైనా ఒక తోడు అవసరం. రేపు మేము పెళ్లిళ్లు చేసుకుని వెళ్ళిపోతే మా అమ్మ ఒంటరిగా ఉండకూడదు. అందుకే మా అమ్మకు మళ్లీ పెళ్లి చేశాం. అతను చాలా మంచి మనిషి. కేర్ హాస్పిటల్ లో ఐ స్పెషలిస్ట్ గా పని చేస్తుంటారు” అని చెప్పాడు సాయి ధరమ్ తేజ్.

Tags:    
Advertisement

Similar News