ఏ కష్టమొచ్చినా నేనున్నాను అంటున్న హీరోయిన్

హిందీ సీరియల్ బ్యూటీ నితి టేలర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ‘కైసీ ఎహ్ యారియాన్’ సీరియల్ తో పాపులర్ అయిన ఈమె తెలుగులో ‘మేం వయసుకు వచ్చాం’, ‘పెళ్లి పుస్తకం’ వంటి సినిమాల్లో సైతం నటించింది. హీరోయిన్ గా నటించింది. ఇక ప్రస్తుతం ‘ఇష్క్ బాజ్’ సీరియల్ లో ముఖ్యపాత్ర పోషిస్తోంది. తాజాగా ఈమె అభిమానుల్లో ఒక యువతి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ విషయం తెలుసుకుని షాక్ అయిన నితి సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ […]

Advertisement
Update: 2019-03-30 23:27 GMT

హిందీ సీరియల్ బ్యూటీ నితి టేలర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ‘కైసీ ఎహ్ యారియాన్’ సీరియల్ తో పాపులర్ అయిన ఈమె తెలుగులో ‘మేం వయసుకు వచ్చాం’, ‘పెళ్లి పుస్తకం’ వంటి సినిమాల్లో సైతం నటించింది. హీరోయిన్ గా నటించింది. ఇక ప్రస్తుతం ‘ఇష్క్ బాజ్’ సీరియల్ లో ముఖ్యపాత్ర పోషిస్తోంది.

తాజాగా ఈమె అభిమానుల్లో ఒక యువతి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ విషయం తెలుసుకుని షాక్ అయిన నితి సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కోసం ఒక ఎమోషనల్ పోస్టు పెట్టింది. పొద్దున లేవగానే ఈ విషయం తెలిసి నా గుండె ఆగినంత పని అయ్యిందని చెప్పుకొచ్చింది.

“జీవితాన్ని నెట్టుకు రావడం అంత సులువైన విషయం కాదు. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది. కానీ ఆ సమయంలో మనకి చనిపోవాలి అనిపించదు. ఆ బాధ మననుండి దూరం కావాలి అనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి. ఇది మీకు మాత్రమే జరగట్లేదు. అందరూ అలానే ఫీల్ అవుతారు” అని చెప్పిన నీతి టేలర్…. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

”మీకు ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగినా, మీ మనసు బాగో లేకపోయినా నేను ఉన్నాను. ఫోన్ లేదా మెసేజ్ చేయండి. మీ మనసు మార్చడానికి నేను కచ్చితంగా ప్రయత్నిస్తాను” అని చెప్పుకొచ్చింది.

Tags:    
Advertisement

Similar News