మా కుటుంబసభ్యులనే ఇరికించే కుట్ర చేస్తున్నారు...

వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. తన తండ్రి హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. చంద్రబాబే ముందు తీర్పులు ఇచ్చేస్తున్న నేపథ్యంలో సిట్‌ విచారణతో న్యాయం జరిగే అవకాశం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులనే ఇరికించేలా చంద్రబాబు తీర్పులు ఇస్తున్నారని… ఇక ఆయన కింద పనిచేసే సిట్‌ అందుకు భిన్నంగా ఎలా వ్యవహరించగలదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రే స్వయంగా కేసును తప్పుదోవ పట్టిస్తూ తన కుటుంబసభ్యులను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. […]

Advertisement
Update: 2019-03-22 03:31 GMT

వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. తన తండ్రి హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. చంద్రబాబే ముందు తీర్పులు ఇచ్చేస్తున్న నేపథ్యంలో సిట్‌ విచారణతో న్యాయం జరిగే అవకాశం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

కుటుంబసభ్యులనే ఇరికించేలా చంద్రబాబు తీర్పులు ఇస్తున్నారని… ఇక ఆయన కింద పనిచేసే సిట్‌ అందుకు భిన్నంగా ఎలా వ్యవహరించగలదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రే స్వయంగా కేసును తప్పుదోవ పట్టిస్తూ తన కుటుంబసభ్యులను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. తనను కలిసిన సునీతకు… కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసి విషయాన్ని వివరించాల్సిందిగా కేంద్ర ఎన్నికల కమిషనర్ సూచించారు.

Advertisement

Similar News