నారా లోకేష్‌కు గట్టి షాక్‌...

మంగళగిరి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన నారా లోకేష్‌కు స్థానికంగా ఇబ్బందులు తప్పడం లేదు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీకి రాజీనామా చేశారు. జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ తమ కుటుంబంతో పాటు పద్మశాలిలను మోసం చేసిందని ఆమె ఆరోపించారు. మంగళగిరిలో వైసీపీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. కాండ్రు కమల ఇటీవలే టీడీపీలో చేరారు. ఆమె వియ్యంకుడు హనుమంతరావు అప్పటికే టీడీపీలో ఉండడంతో ఆయనకు టికెట్ ఇస్తారని భావించారు. కానీ ఆఖరిలో హఠాత్తుగా లోకేష్ తెరపైకి వచ్చారు. టికెట్ ప్రకటించిన తర్వాత స్థానిక […]

Advertisement
Update: 2019-03-21 08:32 GMT

మంగళగిరి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన నారా లోకేష్‌కు స్థానికంగా ఇబ్బందులు తప్పడం లేదు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీకి రాజీనామా చేశారు. జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.

టీడీపీ తమ కుటుంబంతో పాటు పద్మశాలిలను మోసం చేసిందని ఆమె ఆరోపించారు. మంగళగిరిలో వైసీపీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. కాండ్రు కమల ఇటీవలే టీడీపీలో చేరారు.

ఆమె వియ్యంకుడు హనుమంతరావు అప్పటికే టీడీపీలో ఉండడంతో ఆయనకు టికెట్ ఇస్తారని భావించారు. కానీ ఆఖరిలో హఠాత్తుగా లోకేష్ తెరపైకి వచ్చారు.

టికెట్ ప్రకటించిన తర్వాత స్థానిక నేతలను ప్రసన్నం చేసుకునేందుకు లోకేష్ నియోక వర్గానికి వెళ్లారు. ఆ సమయంలో కమలను కూడా కలిశారు.

కానీ అధికారంలో ఉన్నప్పుడే పద్మశాలిలకు కానీ, తమ కుటుంబానికి గానీ న్యాయం చేయలేకపోయారని… ఇక అధికారం పోయాక ఏం చేస్తారని కొద్ది రోజుల క్రితమే ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు ఏకంగా ఆమె వైసీపీలో చేరారు.

Tags:    
Advertisement

Similar News