కారులో ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరామ్‌ మృతదేహం

కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిరుగుపాటి జయరామ్‌ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. నందిగామ మండలం ఐతవరం సమీపంలో కారులో ఆయన మృతదేహం లభించింది. జయరామ్‌ తలపై బలమైన గాయం ఉంది. కారులో మద్యం సీసాలు కూడా ఉన్నాయి. తలకు బలమైన గాయం ఉండడం, మద్యం సీసాలు ఉండడంతో ఆయనను ఎవరైనా హత్య చేశారా? అన్న అనుమానం కలుగుతోంది. జయరామ్‌ది హత్యా, ఆత్మహత్యా అన్న అంశాన్ని తేల్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కంపెనీ ఎండీగా కూడా జయరామ్ […]

Advertisement
Update: 2019-01-31 21:09 GMT

కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిరుగుపాటి జయరామ్‌ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. నందిగామ మండలం ఐతవరం సమీపంలో కారులో ఆయన మృతదేహం లభించింది.

జయరామ్‌ తలపై బలమైన గాయం ఉంది. కారులో మద్యం సీసాలు కూడా ఉన్నాయి. తలకు బలమైన గాయం ఉండడం, మద్యం సీసాలు ఉండడంతో ఆయనను ఎవరైనా హత్య చేశారా? అన్న అనుమానం కలుగుతోంది.

జయరామ్‌ది హత్యా, ఆత్మహత్యా అన్న అంశాన్ని తేల్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కంపెనీ ఎండీగా కూడా జయరామ్ ఉన్నారు. జయరామ్ ఎక్స్‌ప్రెస్ టీవీ పేరుతో న్యూస్‌ చానల్‌ కూడా స్థాపించారు. అయితే అది ఏడాది క్రితమే మూతపడింది.

వ్యాపారానికి సంబంధించి ఎవరితోనైనా జయరామ్‌కు గొడవలు ఉన్నాయా అన్నది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. జయరామ్ ప్రయాణించిన దారిలోని టోల్ ప్లాజాల వద్ద సీసీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News