జగన్ పాదయాత్ర ముగింపుపై చంద్రబాబు హాట్ కామెంట్స్
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర ముగిసింది. ఇచ్చాపురంలో పాదయాత్రను ముగించారు. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అభిప్రాయాన్ని చెప్పారు. పాదయాత్రపై సెటైర్లు వేశారు. జగన్ది అసలు ఒక పాదయాత్రేనా అని సీఎం ప్రశ్నించారు. గతంలో తాను కూడా పాదయాత్ర చేశానని… కానీ ఆనాడు పవిత్ర భావంతో దాన్ని చేశానన్నారు. ప్రజలతో మమేకం అయి వారి కష్టాలు తెలుసుకున్నానని వివరించారు. ఈయన(జగన్) మాత్రం నాలుగు రోజులు పాదయాత్ర చేస్తే… రెండు […]
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర ముగిసింది. ఇచ్చాపురంలో పాదయాత్రను ముగించారు. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అభిప్రాయాన్ని చెప్పారు. పాదయాత్రపై సెటైర్లు వేశారు.
జగన్ది అసలు ఒక పాదయాత్రేనా అని సీఎం ప్రశ్నించారు. గతంలో తాను కూడా పాదయాత్ర చేశానని… కానీ ఆనాడు పవిత్ర భావంతో దాన్ని చేశానన్నారు. ప్రజలతో మమేకం అయి వారి కష్టాలు తెలుసుకున్నానని వివరించారు. ఈయన(జగన్) మాత్రం నాలుగు రోజులు పాదయాత్ర చేస్తే… రెండు రోజులు కోర్టుకు వెళ్లడంతోనే సరిపోయిందని ఎద్దేవా చేశారు.
హంగూ ఆర్భాటాలతో రోజుకు ఏడెనిమిది కిలోమీటర్లు నడిస్తే అది పాదయాత్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. గతంలో తాను ఆరోగ్యం దెబ్బతిన్నా సరే విరామం లేకుండా పాదయాత్ర కొనసాగించానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. జగన్ ఒక అవినీతి చక్రవర్తి అని విమర్శించారు.
అవినీతి పితామహుడు తిరిగి తనపై అవినీతిపరుడు అంటూ పుస్తకాలు వేయడం దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. త్వరలోనే డ్వాక్రా మహిళలకు సెల్ఫోన్లు ఇస్తామని … ఏదైనా సమస్య వస్తే 1100కి ఆ ఫోన్ ద్వారా కాల్ చేసి చంద్రన్న అంటే చాలు… వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరిస్తుందన్నారు.