మహిళా లెక్చరర్‌ను నడిరోడ్డుపై ఈడ్చి కొట్టిన టీడీపీ నేత కేశవ నాయుడు

చిత్తూరు జిల్లాలో ఒక టీడీపీ నేత రెచ్చిపోయాడు. మహిళా లెక్చరర్‌ను ఇంటిలో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి విచక్షణా రహితంగా కొట్టాడు. ఎర్రవారిపాలెం మండలం కొంగవారిపల్లెలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు దీప ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. దీప కుటుంబసభ్యులకు చెందిన ఆవు ఒకటి… టీడీపీ నేత కేశవనాయుడు పొలంలోకి వెళ్లింది. ఈ విషయంలో దీపతో కేశవనాయుడు, అతడి కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఈ క్రమంలోనే కేశవనాయుడు… మహిళా లెక్చరర్‌ దీపను రోడ్డు పైకి […]

Advertisement
Update: 2018-12-26 04:26 GMT

చిత్తూరు జిల్లాలో ఒక టీడీపీ నేత రెచ్చిపోయాడు. మహిళా లెక్చరర్‌ను ఇంటిలో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి విచక్షణా రహితంగా కొట్టాడు. ఎర్రవారిపాలెం మండలం కొంగవారిపల్లెలో ఈ ఘటన జరిగింది.

బాధితురాలు దీప ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. దీప కుటుంబసభ్యులకు చెందిన ఆవు ఒకటి… టీడీపీ నేత కేశవనాయుడు పొలంలోకి వెళ్లింది.

ఈ విషయంలో దీపతో కేశవనాయుడు, అతడి కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఈ క్రమంలోనే కేశవనాయుడు… మహిళా లెక్చరర్‌ దీపను రోడ్డు పైకి ఈడ్చుకొచ్చి కొట్టాడు. ఒంటరిని చేసి అవమానించారు.

ఈ దాడిని కొందరు సెల్‌ఫోల్‌లో రికార్డు చేసి మీడియాకు అందజేశారు. దాడి చేసిన కేశవనాయుడు టీడీపీ నేత కావడంతో పోలీసులు కూడా స్పందించడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు.

Tags:    
Advertisement

Similar News