జగన్ సీఎం అయితే తొలుత నన్నే అరెస్ట్ చేస్తాడు....
టీడీపీ ఎమ్మెల్యేలపై భారీగా వ్యతిరేకత ఉందన్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. 40 శాతం ఎమ్మెల్యేలను మారిస్తే టీడీపీ గెలుస్తుందన్నారు. చంద్రబాబుపై వ్యతిరేకత లేదు గానీ…. ఎమ్మెల్యేలపై మాత్రం బాగా వ్యతిరేకత ఉందన్నారు. 40శాతం మంది ఎమ్మెల్యేలను మారుస్తే చంద్రబాబు గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. పవన్, జగన్ కలిసే అవకాశం లేదన్నారు. ఉత్తర, దక్షణ ధృవాలు ఎప్పుడూ కలవబోవన్నారు. జగన్, మోడీ ఇద్దరిదీ ఫ్యాక్షన్ బుద్ది అని విమర్శించారు. చంద్రబాబు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి […]
టీడీపీ ఎమ్మెల్యేలపై భారీగా వ్యతిరేకత ఉందన్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. 40 శాతం ఎమ్మెల్యేలను మారిస్తే టీడీపీ గెలుస్తుందన్నారు. చంద్రబాబుపై వ్యతిరేకత లేదు గానీ…. ఎమ్మెల్యేలపై మాత్రం బాగా వ్యతిరేకత ఉందన్నారు.
40శాతం మంది ఎమ్మెల్యేలను మారుస్తే చంద్రబాబు గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. పవన్, జగన్ కలిసే అవకాశం లేదన్నారు. ఉత్తర, దక్షణ ధృవాలు ఎప్పుడూ కలవబోవన్నారు.
జగన్, మోడీ ఇద్దరిదీ ఫ్యాక్షన్ బుద్ది అని విమర్శించారు. చంద్రబాబు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అని… మోడీ తానొక్కడినే బతకాలి అనుకునే వ్యక్తి అన్నారు. చంద్రబాబుపై కక్షతోనే కేంద్రం ఏపీకి నిధులు ఇవ్వడం లేదన్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయితే తొలుత అరెస్ట్ చేసేది తననేనని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పవన్కు టీడీపీ టికెట్ ఇవ్వాల్సిందిగా చంద్రబాబును కోరుతానని… అయితే తుది నిర్ణయం చంద్రబాబుదేనన్నారు.