యూత్ ఒలింపిక్స్ లో భారత్ సరికొత్త చరిత్ర
15 ఏళ్ల భారత లిఫ్టర్ కు బంగారు పతకం వెయిట్ లిఫ్టింగ్ లో భారత గోల్డెన్ బోయ్ జెర్మీ లాల్ రింగా 274కిలోల ఓవరాల్ రికార్డుతో స్వర్ణ పతకం ప్రపంచ యువజన ఒలింపిక్స్ చరిత్రలోనే… భారత్ తొలి బంగారు పతకం నెగ్గి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. అర్జెంటీనా రాజధాని బ్యునోస్ ఏర్స్ వేదికగా జరుగుతున్న 2018 యూత్ ఒలింపిక్స్.. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 62 కిలోల విభాగంలో ఇండియన్ గోల్డెన్ బోయ్, మిజోరం సంచలనం, 15 […]
- 15 ఏళ్ల భారత లిఫ్టర్ కు బంగారు పతకం
- వెయిట్ లిఫ్టింగ్ లో భారత గోల్డెన్ బోయ్ జెర్మీ లాల్ రింగా
- 274కిలోల ఓవరాల్ రికార్డుతో స్వర్ణ పతకం
ప్రపంచ యువజన ఒలింపిక్స్ చరిత్రలోనే… భారత్ తొలి బంగారు పతకం నెగ్గి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.
అర్జెంటీనా రాజధాని బ్యునోస్ ఏర్స్ వేదికగా జరుగుతున్న 2018 యూత్ ఒలింపిక్స్.. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 62 కిలోల విభాగంలో ఇండియన్ గోల్డెన్ బోయ్, మిజోరం సంచలనం, 15 ఏళ్ల జెర్మీ లాల్ రింగా స్వర్ణపతకం సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచాడు.
షూటింగ్ లో తుషార్ మానే, మేహులీ ఘోష్, మహిళల జూడోలో తబేబీ దేవీ సిల్వర్ మెడల్స్ సాధిస్తే…ఇప్పుడు జెర్మీ లాల్ రింగా బంగారు మోత మోగించాడు.
నాన్ జింగ్ వేదికగా ముగిసిన 2014 యూత్ ఒలింపిక్స్ లో…భారత్ ఒక్కో రజత, కాంస్య పతకాలు మాత్రమే సాధించగలిగింది. సింగపూర్ వేదికగా 2010లో ముగిసిన ప్రారంభ యూత్ ఒలింపిక్స్ లో భారత్ ఆరు రజత, రెండు కాంస్య పతకాలు సాధించింది.
అయితే …ప్రస్తుత ఒలింపిక్స్ లో మాత్రం తొలి బంగారు పతకంతో చరిత్ర సృష్టించింది.