అయోధ్య కేసులో సుప్రీం కీలక తీర్పు

అయోధ్య వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు చెప్పింది. కేసును విస్రృత ధర్మాసనానికి బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి కేసును ఇవ్వాల్సిన అవసరం లేదని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్‌ అభిప్రాయపడ్డారు. ఇరువురి తరపున జస్టిస్ అశోక్ భూషణ్ తీర్పు చదివి వినిపించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ నజీర్‌ … 1994లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై విచారణను ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి అప్పగించాలని సూచించారు. […]

Advertisement
Update: 2018-09-27 05:17 GMT

అయోధ్య వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు చెప్పింది. కేసును విస్రృత ధర్మాసనానికి బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది.

ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి కేసును ఇవ్వాల్సిన అవసరం లేదని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్‌ అభిప్రాయపడ్డారు. ఇరువురి తరపున జస్టిస్ అశోక్ భూషణ్ తీర్పు చదివి వినిపించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ నజీర్‌ … 1994లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై విచారణను ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి అప్పగించాలని సూచించారు.

మసీదులు ఇస్లాంలో భాగం కాదంటూ 1994లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును త్రిసభ్య ధర్మాసనం సమర్ధించింది. అయోధ్య యాజమాన్య హక్కులు ఎవరివన్న దానిపై అక్టోబర్ 29 నుంచి విచారిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.

Tags:    
Advertisement

Similar News