నాడు అర్జున.... నేడు ఖేల్ రత్న
సచిన్, ధోనీల సరసన విరాట్ కొహ్లీ టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ… భారత అత్యున్నత క్రీడా పురస్కారం… రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకొన్నాడు. న్యూ ఢిల్లీలో ప్రత్యేకంగా నిర్వహించిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో కొహ్లీకి రాష్ట్రపతి పురస్కరాన్ని ప్రదానం చేశారు. గతంలోనే (2016 సీజన్ లోనే ) ఖేల్ రత్న పురస్కారం కోసం కొహ్లీ పేరును ప్రతిపాదించినా ఎంపిక కాలేకపోయాడు. అయితే…. గత ఏడాది కాలంగా అసాధారణంగా రాణించిన కొహ్లీ…. ఇటీవలే ఇంగ్లండ్ తో […]
- సచిన్, ధోనీల సరసన విరాట్ కొహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ… భారత అత్యున్నత క్రీడా పురస్కారం… రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకొన్నాడు.
న్యూ ఢిల్లీలో ప్రత్యేకంగా నిర్వహించిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో కొహ్లీకి రాష్ట్రపతి పురస్కరాన్ని ప్రదానం చేశారు. గతంలోనే (2016 సీజన్ లోనే ) ఖేల్ రత్న పురస్కారం కోసం కొహ్లీ పేరును ప్రతిపాదించినా ఎంపిక కాలేకపోయాడు.
అయితే…. గత ఏడాది కాలంగా అసాధారణంగా రాణించిన కొహ్లీ…. ఇటీవలే ఇంగ్లండ్ తో ముగిసిన ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సైతం రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో 594 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సైతం ఆటగాడిగా, కెప్టెన్ గా అందుకోగలిగాడు.
విరాట్ కొహ్లీ రాజీవ్ ఖేల్ రత్న గౌరవం పొందిన మూడో క్రికెటర్ గా రికార్డుల్లో చేరనున్నాడు. గతంలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే రాజీవ్ ఖేల్ రత్న గౌరవం పొందిన క్రికెటర్లుగా ఉన్నారు.