ఏపీలో ఫిరాయించిన మరో ఎమ్మెల్సీ

ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయింపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. గెలిచిన పార్టీకి రాజీనామా చేయకుండానే చంద్రబాబు ఇచ్చిన తీర్థాన్ని పుచ్చుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు టీడీపీలో చేరారు. శుక్రవారం చంద్రబాబు కరకట్ట నివాసంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. సుధాకర్‌బాబు కాంగ్రెస్‌ హయాంలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డికి సుధాకర్‌బాబు అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు చేస్తున్న అభివృద్దిని చూసే తాను టీడీపీలో చేరానని సుభాకర్‌బాబు చెప్పారు. Click on […]

Advertisement
Update: 2016-09-23 22:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయింపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. గెలిచిన పార్టీకి రాజీనామా చేయకుండానే చంద్రబాబు ఇచ్చిన తీర్థాన్ని పుచ్చుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు టీడీపీలో చేరారు. శుక్రవారం చంద్రబాబు కరకట్ట నివాసంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. సుధాకర్‌బాబు కాంగ్రెస్‌ హయాంలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డికి సుధాకర్‌బాబు అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు చేస్తున్న అభివృద్దిని చూసే తాను టీడీపీలో చేరానని సుభాకర్‌బాబు చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News