పసిబిడ్డను 17 సార్లు పొడిచి చంపిన తల్లి

నేహాగోయల్‌ (35) చదువుకున్న స్త్రీ. కొడుకు పుట్టాలని పరితపించింది. ఐవీఎఫ్‌ ద్వారా, సరోగసీ ద్వారా కొడుకుకోసం ప్రయత్నించింది. మగబిడ్డకోసం ఆమె చేయని పూజలు, తిరగని గుడులు లేవు. అయినా ఆమెకు ఆడపిల్ల పుట్టింది. ఆమెలో అసంతృప్తి, అసహనం హద్దులు దాటింది. కన్నబిడ్డ అని కూడా చూడకుండా నాలుగు నెలల కూతురిని గొంతు కోసి, కసితీరక శరీరంమీద ఏకంగా 17 కత్తిపోట్లు పొడిచి చంపేసింది. తరువాత ఏమీ ఎరుగనట్లు ఆమె, ఆమె కుటుంబ సభ్యులు కూతురు కనపడటం లేదంటూ […]

Advertisement
Update: 2016-09-10 03:42 GMT

నేహాగోయల్‌ (35) చదువుకున్న స్త్రీ. కొడుకు పుట్టాలని పరితపించింది. ఐవీఎఫ్‌ ద్వారా, సరోగసీ ద్వారా కొడుకుకోసం ప్రయత్నించింది. మగబిడ్డకోసం ఆమె చేయని పూజలు, తిరగని గుడులు లేవు. అయినా ఆమెకు ఆడపిల్ల పుట్టింది. ఆమెలో అసంతృప్తి, అసహనం హద్దులు దాటింది. కన్నబిడ్డ అని కూడా చూడకుండా నాలుగు నెలల కూతురిని గొంతు కోసి, కసితీరక శరీరంమీద ఏకంగా 17 కత్తిపోట్లు పొడిచి చంపేసింది. తరువాత ఏమీ ఎరుగనట్లు ఆమె, ఆమె కుటుంబ సభ్యులు కూతురు కనపడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ హత్య ఉదంతం వెలుగుచూసింది. ఆ పసిబిడ్డ మృత దేహాన్ని ప్యాక్‌ చేసి ఓ పనిచేయని ఏర్‌ కండీష్‌నర్‌లో దాచిపెట్టింది. ఈ హత్య ఆమె ఒక్కటే చేసిందా? కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందా? అనేది తేలాల్సి ఉంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News