కోమటిరెడ్డిని బట్టలూడదీసి కొడతారు

నయీంతో తమకు సంబంధాలున్నాయంటూ వస్తున్న ఆరోపణలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నయీంను పెంచిపోషించిందే కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇలాగే మాట్లాడితే బట్టలూడదీసి కొడతారని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే కిషోర్ అన్నారు. టీడీపీ పదేళ్లు, కాంగ్రెస్ పదేళ్ల పాటు పెంచి పోషించిన క్రూరమృగాన్ని అంతంమొందించింది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. నయీంతో తమకు హాని […]

Advertisement
Update: 2016-08-23 02:21 GMT

నయీంతో తమకు సంబంధాలున్నాయంటూ వస్తున్న ఆరోపణలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నయీంను పెంచిపోషించిందే కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇలాగే మాట్లాడితే బట్టలూడదీసి కొడతారని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే కిషోర్ అన్నారు.

టీడీపీ పదేళ్లు, కాంగ్రెస్ పదేళ్ల పాటు పెంచి పోషించిన క్రూరమృగాన్ని అంతంమొందించింది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. నయీంతో తమకు హాని ఉన్న విషయాన్ని నాటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలకు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదని ఆ నేతలే అన్నారని గుర్తు చేశారు. అలాంటి క్రూరమృగాన్ని అంతమొందించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్ మీద నమ్మకం లేదు గానీ అధికారుల మీద నమ్మకం ఉందని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ఆ అధికారులను ఆ స్థానంలో పెట్టింది కేసీఆరేనని మర్చిపోకూడదని గుర్తుచేశారు. కేసీఆర్ ఇంత బాగా పనిచేస్తుంటే పచ్చకామెర్ల రోగిలా కోమటిరెడ్డి మాట్లాడుతున్నారన్నారు. వాళ్లకు ఏమైనా అనుమానాలుంటే సిట్ అధికారులకు ఒక దరఖాస్తు ఇచ్చి చూడాలన్నారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News