వైసీపీ అభిమానులకు నటుడు శివాజీ వార్నింగ్

నటుడు శివాజీ విజయవాడలో పుష్కర స్నానం చేశారు. పుష్కర ఏర్పాట్లు బాగున్నాయని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శివాజీ… వైసీపీ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తనకు కులం అంటగడుతున్నారని ముఖ్యంగా వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు సోషల్‌ మీడియాలో తనకు కులాన్ని అంటగడుతూ పోస్టులు పెడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ” నేను ఉరితాడు తెచ్చుకునేందుకు ఉగాండా వెళ్లానని ఒక యధవ కామెంట్ చేశాడు” అని తీవ్రంగా స్పందించారు. ఇది జగన్‌ రెడ్డికే […]

Advertisement
Update: 2016-08-17 23:27 GMT

నటుడు శివాజీ విజయవాడలో పుష్కర స్నానం చేశారు. పుష్కర ఏర్పాట్లు బాగున్నాయని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శివాజీ… వైసీపీ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తనకు కులం అంటగడుతున్నారని ముఖ్యంగా వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు సోషల్‌ మీడియాలో తనకు కులాన్ని అంటగడుతూ పోస్టులు పెడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ” నేను ఉరితాడు తెచ్చుకునేందుకు ఉగాండా వెళ్లానని ఒక యధవ కామెంట్ చేశాడు” అని తీవ్రంగా స్పందించారు. ఇది జగన్‌ రెడ్డికే మంచిది కాదని హెచ్చరించారు. తాను కులం కోసం పోరాటం చేయడం లేదన్నారు. జాతి కోసం పోరాటం చేస్తున్నానని అన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో కేవలం బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా చంద్రబాబుకు ఇబ్బంది లేకుండా శివాజీలాంటి వారు ప్రయత్నం చేస్తున్నారని విమర్శ ఉంది. ఈ నేపథ్యంలోనే పలువురు శివాజీ తీరును ఎండగడుతూ ఇటీవల పోస్టులు పెడుతున్నారు. ఆయన అనుమానాస్పద తీరును ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రచారంపై శివాజీ తీవ్రంగా స్పందించారు. కేంద్రం ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తే సహించే ప్రసక్తే లేదన్నారు శివాజీ. తాను హోదా కోసం పోరాటం చేయకుండా మౌనంగా ఉండి ఉంటే బీజేపీలో తన స్థానం ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు శివాజీ. గతంలో శివాజీ బీజేపీలో ఉండేవారు. అయితే బీజేపీలోనే ఉంటూ ఆ పార్టీని ఇబ్బందిపెట్టేలా మాట్లాడేవారు. దీంతో శివాజీ చంద్రబాబుకు కోవర్టుగా పనిచేస్తున్నారన్న అనుమానాన్ని అప్పట్లో కమలనాథులు వ్యక్తం చేశారు. అసలు బీజేపీతో శివాజీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు.

శివాజీ వార్నింగ్ చూశాక సోషల్ మీడియాలో జోకులు మొదలయ్యాయి. ఏ అర్హతలతో తనను నాయకుడుగా భావించుకుంటున్నాడో, వార్నింగ్ లు ఇస్తున్నాడో అర్ధం కావడం లేదని రాజకీయాలు పక్కనపెట్టి తన స్థాయి ఏంటో తను తెలుసుకోవాలని పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబుకు ఉపయోగపడేలా నాలుగు మాటలు మాట్లాడినప్పుడు అవి మీడియాలో కవర్ కాగానే తానోపెద్ద నాయకుడిగా భావించుకుంటున్నాడని తన తలమీద పది రూపాయలు పెడితే రూపాయి విలువ కూడా చేయడని ముందు తనేంటో తాను తెలుసుకోవాలని నెటిజన్ లు కోరుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News