కేంద్ర మంత్రి భార్య రహస్యాలు మాట్లాడారా?

కేంద్రమంత్రి వీకే సింగ్ భార్య భారతీ సింగ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఒక వ్యక్తి తాను మాట్లాడిన మాటలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. రికార్డు చేసిన వ్యక్తి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని ఆమె చెబుతోంది. ఆగస్టు 6న తన కుటుంబానికి తెలిసిన ప్రదీప్ చౌహాన్‌తో తాను మాట్లాడినట్టు ఆమె చెప్పారు. అయితే దాన్ని రహస్యంగా రికార్డు చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని లేకుంటే సోషల్ మీడియాలో పెడుతానని బెదిరిస్తున్నాడని ఢిల్లీ పోలీసులకు […]

Advertisement
Update: 2016-08-17 03:42 GMT

కేంద్రమంత్రి వీకే సింగ్ భార్య భారతీ సింగ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఒక వ్యక్తి తాను మాట్లాడిన మాటలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. రికార్డు చేసిన వ్యక్తి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని ఆమె చెబుతోంది. ఆగస్టు 6న తన కుటుంబానికి తెలిసిన ప్రదీప్ చౌహాన్‌తో తాను మాట్లాడినట్టు ఆమె చెప్పారు. అయితే దాన్ని రహస్యంగా రికార్డు చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని లేకుంటే సోషల్ మీడియాలో పెడుతానని బెదిరిస్తున్నాడని ఢిల్లీ పోలీసులకు చెప్పారు. అయితే ప్రదీప్ చౌహాన్ వద్ద ఉన్న ఆడియో టేపుల్లో ఏముందో తనకు తెలియదని… కానీ వాటి ద్వారా తన భర్త పరువు దెబ్బతీస్తానంటున్నాడని భారతీ సింగ్ చెప్పారు. తాను మాట్లాడిన మాటలకు వేరే ఆడియోను మిక్స్ చేసి బెదిరింపులకు దిగుతుండవచ్చని ఆమె చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News