వాళ్లు చంపుతారని...వీళ్లే చనిపోదామనుకున్నారు!
తమిళనాడులోని కొయింబత్తూరుకి సమీపంలోని పొల్లాచ్చికి చెందిన గౌతం, ప్రీత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావటంతో ఇద్దరి ఇళ్లలోని వారు వారి ప్రేమని ఒప్పుకోలేదు. దాంతో రెండునెలల క్రితం ఇంట్లోంచి పారిపోయి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నారు. అయితే మొదట వ్యతిరేకించినా తరువాత ప్రీత తరుపువారు ఆ పెళ్లిని అంగీకరించారు. కానీ గౌతం తండ్రి మాత్రం ప్రీతని కోడలిగా ఒప్పుకునేది లేదని చెప్పేశాడు. తన కొడుకుని ఆమెనుండి ఎలాగైనా విడదీయాలని అనుకున్నాడు. తండ్రి తీరు చూసి భయపడిన […]
తమిళనాడులోని కొయింబత్తూరుకి సమీపంలోని పొల్లాచ్చికి చెందిన గౌతం, ప్రీత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావటంతో ఇద్దరి ఇళ్లలోని వారు వారి ప్రేమని ఒప్పుకోలేదు. దాంతో రెండునెలల క్రితం ఇంట్లోంచి పారిపోయి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నారు. అయితే మొదట వ్యతిరేకించినా తరువాత ప్రీత తరుపువారు ఆ పెళ్లిని అంగీకరించారు. కానీ గౌతం తండ్రి మాత్రం ప్రీతని కోడలిగా ఒప్పుకునేది లేదని చెప్పేశాడు. తన కొడుకుని ఆమెనుండి ఎలాగైనా విడదీయాలని అనుకున్నాడు.
తండ్రి తీరు చూసి భయపడిన గౌతం…ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రీత సైతం అతనితో పాటు చనిపోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 12న ఇద్దరూ కలిసి ఎలుకల మందు తాగారు. పొరుగున ఉన్నవారు సమయానికి ఆసుపత్రిలో చేర్చడంతో ఇద్దరికీ ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఐసియులో చికిత్స పొందుతున్నారు. తమిళనాడులోని కొయింబత్తూరు ప్రాంతంలో పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత ఏడాది శంకర్ అనే యువకుడిని అతను ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయి తాలూకూ వారు పట్టపగలు నరికి చంపారు. ఈ క్రమంలో గౌతం… తమ పెద్దవారు తమని చంపేస్తారనే భయంతోనే…ప్రీతతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.