కేటీఆర్‌ కోసం మూడు ప్రత్యేక విమానాలు

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అభిమానాలు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు ఏకంగా మూడు విమానాలను తీసుకొచ్చారు. వాటి సాయంతో ఆకాశం నుంచి పూల వర్షం కురిపించారు. టీఆర్‌ఎస్ భవన్, సచివాలయం, ట్యాంక్‌బండ్‌ బుద్ధుడి విగ్రహంపైనా పూలవర్షం కురిపించారు. కేటీఆర్ బొమ్మలను ముద్రించిన కరపత్రాలను ఆకాశం నుంచి జారవిడిచారు. అవే విమానాల సాయంతో నగరశివారులో కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా 10 లక్షల విత్తనాలను అటవీ ప్రాంతంలో వెదజల్లారు. విత్తనాలు చల్లడం వరకు బాగానే ఉన్నా… పూల వర్షం […]

Advertisement
Update: 2016-07-24 00:14 GMT

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అభిమానాలు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు ఏకంగా మూడు విమానాలను తీసుకొచ్చారు. వాటి సాయంతో ఆకాశం నుంచి పూల వర్షం కురిపించారు. టీఆర్‌ఎస్ భవన్, సచివాలయం, ట్యాంక్‌బండ్‌ బుద్ధుడి విగ్రహంపైనా పూలవర్షం కురిపించారు. కేటీఆర్ బొమ్మలను ముద్రించిన కరపత్రాలను ఆకాశం నుంచి జారవిడిచారు. అవే విమానాల సాయంతో నగరశివారులో కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా 10 లక్షల విత్తనాలను అటవీ ప్రాంతంలో వెదజల్లారు. విత్తనాలు చల్లడం వరకు బాగానే ఉన్నా… పూల వర్షం కురిపించేందుకు మూడు విమానాలను వాడడమే కాస్త అతిగా ఉందన్న భావన వ్యక్తమవుతోంది. కరెన్సీ నోట్లతో పూలదండలు వేయించుకోవడం, కోట్లు ఖర్చు పెట్టి పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం వంటి చర్యలు ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లోనే చూశాం. ఇప్పుడా వ్యక్తి పూజ తెలుగు రాష్ట్రాలకు పాకినట్టుగా ఉంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News