సెంటిమెంట్ పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్

రామ్ చరణ్ కు దసరా సెంటిమెంట్ అస్సలు పడదు. దసరా కానుకగా వచ్చిన ప్రతిసారి అట్టర్ ఫ్లాప్ అందుకున్నాడు. సో… ఈసారి దసరాకు అనుకున్న ధ్రువ సినిమాను చెర్రీ వాయిదా వేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. దసరా సందర్భంగా కాకుండా.. దీపావళి కానుకగా ధ్రువను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే చెర్రీ వీటిపై క్లారిటీ ఇచ్చాడు. బ్యాడ్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ దసరాకే వస్తానంటున్నాడు. అభిమానులను మరింత టెన్షన్ లోకి నెట్టాడు.  తొలిసారిగా ఫేస్ బుక్ లో చిట్ […]

Advertisement
Update: 2016-07-15 05:36 GMT
రామ్ చరణ్ కు దసరా సెంటిమెంట్ అస్సలు పడదు. దసరా కానుకగా వచ్చిన ప్రతిసారి అట్టర్ ఫ్లాప్ అందుకున్నాడు. సో… ఈసారి దసరాకు అనుకున్న ధ్రువ సినిమాను చెర్రీ వాయిదా వేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. దసరా సందర్భంగా కాకుండా.. దీపావళి కానుకగా ధ్రువను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే చెర్రీ వీటిపై క్లారిటీ ఇచ్చాడు. బ్యాడ్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ దసరాకే వస్తానంటున్నాడు. అభిమానులను మరింత టెన్షన్ లోకి నెట్టాడు.
తొలిసారిగా ఫేస్ బుక్ లో చిట్ చాట్ సెషన్ పెట్టాడు రామ్ చరణ్. అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. తన ఫ్యామిలీ లైఫ్ తో పాటు.. చిరు 150వ సినిమాకు సంబంధించి చాలా వివరాలకు క్లారిటీ ఇచ్చాడు. ఇందులో భాగంగానే ధ్రువ సినిమా విడుదలపై కూడా క్లారిటీ ఇచ్చాడు చెర్రీ. అంతా అనుకుంటున్నట్టు తన సినిమా దీపావళికి వాయిదా పడలేదని, అనుకున్న టైమ్ కు అనుకున్నట్టు దసరాకే వచ్చి తీరుకుందని అంటున్నాడు.
ఈమధ్య రామ్ చరణ్ చేసిన బ్రూస్ లీ సినిమా దసరా కానుకగానే బరిలోకి వచ్చి అట్టర్ ఫ్లాప్ అయింది. అంతకంటే ముందు చెర్రీ నటించిన తుఫాన్, గోవిందుడు అందరివాడే సినిమాలు కూడా దాదాపు ఇదే సీజన్ లో విడుదయ్యాయి. వీటిలో తుఫాన్ సినిమా డిజాస్టర్ గా నిలవగా… గోవిందుడు అందరివాడేలే సినిమా యావరేజ్ టాక్ తో కథ ముగించింది.
Click on Image to Read:
Tags:    
Advertisement

Similar News