చంద్రబాబుతో తిరిగిన నరహంతకుడు

నెల్లూరు జిల్లాలో వరుస హత్యలకు పాల్పడిన నరహంతకుడు కుక్కపల్లి వెంకటేశ్వర్లు గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూడు రోజుల క్రితం సెట్‌అప్ బాక్సులు రిపేర్ చేసే వ్యక్తినంటూ నెల్లూరులో ఆడిటర్ నాగేశ్వర్ ఇంటిలోకి చొరబడ్డ వెంకటేశ్వర్లు అనంతరం ఆడిటర్ భార్యను సుత్తితో మోదీ చంపేశాడు. అడ్డువచ్చిన ఆమె కుమారుడు,కూతురిపైనా కత్తితో దాడి చేశాడు. వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అయితే అదే సమయంలో వచ్చిన నాగేశ్వరరావు హంతకుడిని పట్టుకుని స్థానికుల సాయంతో పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా […]

Advertisement
Update: 2016-07-11 23:44 GMT

నెల్లూరు జిల్లాలో వరుస హత్యలకు పాల్పడిన నరహంతకుడు కుక్కపల్లి వెంకటేశ్వర్లు గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూడు రోజుల క్రితం సెట్‌అప్ బాక్సులు రిపేర్ చేసే వ్యక్తినంటూ నెల్లూరులో ఆడిటర్ నాగేశ్వర్ ఇంటిలోకి చొరబడ్డ వెంకటేశ్వర్లు అనంతరం ఆడిటర్ భార్యను సుత్తితో మోదీ చంపేశాడు. అడ్డువచ్చిన ఆమె కుమారుడు,కూతురిపైనా కత్తితో దాడి చేశాడు. వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అయితే అదే సమయంలో వచ్చిన నాగేశ్వరరావు హంతకుడిని పట్టుకుని స్థానికుల సాయంతో పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా అనేక నేరాలు వెలుగుచూశాయి. వెంకటేశ్వర్లు మహిళలు, వృద్ధులు ఉండే ఇళ్లను టార్గెట్ చేసుకుని హత్యలు చేసి దోపిడీకి పాల్పడేవాడు. పెద చెరుకూరులోని శివాలయ పూజారి చంద్రమౌళిశ్వరరావు, అతని భార్య పుష్పవేణిని అతి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. మరొక చోట మరో హత్య చేశాడు.

కుక్కపల్లి వెంకటేశ్వర్లు టీడీపీ కార్యకర్త. అనంతపురం జిల్లా హిందూపురంలోని ఎన్టీఆర్ సర్కిల్‌ వద్ద వెంగమాంబ హోటల్‌లో పనిచేశాడు. ఆ సమయంలో టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. చంద్రబాబు పాదయాత్ర సమయంలో నడుముకు పనుపు టవల్ కట్టి టీడీపీ అధినేత వెంట నడిచారు. ఆ ఫోటోలను కూడా తన ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేసుకున్నాడు. అనంతరం హిందూపురం నుంచి నెల్లూరు జిల్లాకు మకాం మార్చాడు. అక్కడే నూడిల్స్ అమ్ముకుంటూ హత్యలు, దోపిడిలు చేస్తుండేవాడు.

click on image to read-

Tags:    
Advertisement

Similar News