తెలంగాణ ఎంపీ క‌విత నోట జై ఆంధ్ర‌!

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపీ  క‌విత ఓ ఆస‌క్తిక‌ర నినాదం చేశారు. ఉద్య‌మంలో జై తెలంగాణ‌! నినాదం త‌ప్ప మిగిలిన వాటికి పెద్ద‌గా ఆమె ప్రాధాన్యం ఇచ్చింది లేదు. పార్ల‌మెంటులోనూ ఆమె ప్ర‌సంగం అన‌ర్గ‌ళంగా సాగినా… అది మొత్తం తెలంగాణ విష‌యాల‌కే పరిమిత‌మ‌వుతుంద‌న్నది అంద‌రికీ తెలిసిందే! ఎప్పుడూ జై తెలంగాణ..! అంటూ నిన‌దించే ఆమె తాజాగా…  జై ఆంధ్ర‌! అని ప‌లికి తెలుగు వారంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. దీని వెన‌క క‌థ ఏంట‌నుకుంటున్నారా? ప‌్రస్తుతం అమెరికాలో […]

Advertisement
Update: 2016-07-04 00:12 GMT
తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపీ క‌విత ఓ ఆస‌క్తిక‌ర నినాదం చేశారు. ఉద్య‌మంలో జై తెలంగాణ‌! నినాదం త‌ప్ప మిగిలిన వాటికి పెద్ద‌గా ఆమె ప్రాధాన్యం ఇచ్చింది లేదు. పార్ల‌మెంటులోనూ ఆమె ప్ర‌సంగం అన‌ర్గ‌ళంగా సాగినా… అది మొత్తం తెలంగాణ విష‌యాల‌కే పరిమిత‌మ‌వుతుంద‌న్నది అంద‌రికీ తెలిసిందే! ఎప్పుడూ జై తెలంగాణ..! అంటూ నిన‌దించే ఆమె తాజాగా… జై ఆంధ్ర‌! అని ప‌లికి తెలుగు వారంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు.
దీని వెన‌క క‌థ ఏంట‌నుకుంటున్నారా? ప‌్రస్తుతం అమెరికాలో తెలుగువారి ఆధ్వ‌ర్యంలో ఆటా ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. శ‌నివారం షికాగోలో జ‌రిగిన ఈ వేడుకకు ఎంపీ క‌విత హాజ‌రై ప్ర‌సంగించారు. తెలుగువారు ఎక్క‌డున్నా.. క‌లిసి ఉండాల‌ని చెప్పారు. స‌ముద్రాలు, ఖండాలు దాటి వ‌చ్చిన తెలుగుప్ర‌జలంతా మ‌న ఆచారాలు, సంప్ర‌దాయాలు కాపాడుకోవాల‌ని పిలుపునిచ్చారు. అమెరికాలో తెలుగువారి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న ఆటా, తానా ప్ర‌తినిధుల‌ను ఆమె అభినందించారు. చివ‌ర‌లో జై తెలంగాణా..! జై ఆంధ్రా..! జై హింద్‌..! అంటూ త‌న‌దైన శైలిలో ప్ర‌సంగాన్ని ముగించారు. క‌విత నోట జై ఆంధ్రా..! అన‌గానే స‌భ‌లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News