మరో తొమ్మిది మందిపై వేటు

హైకోర్టు, తెలంగాణ న్యాయవాదుల మధ్య పోరు ఉధృతమవుతోంది. చలో రాజ్‌ భవన్‌లో పాల్గొన్నారంటూ ఇప్పటికే ఇద్దరు న్యాయమూర్తులపై సస్పెన్షన్ వేటు వేసిన హైకోర్టు… తాజాగా మరో తొమ్మిది మందిపై వేటు వేసింది. తెలంగాణ న్యాయాధికారుల సంఘం ఉపాధ్యక్షులు సున్నం శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్‌ ప్రసాద్‌లతో పాటు రమాకాంత్‌, తిరుపతి, రాధాకృష్ణ చౌహా తదితరులను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గత నెల 3న ఉమ్మడి హైకోర్టు విడుదల చేసిన ‘ప్రాథమిక కేటాయింపుల జాబితా’ను నిరసిస్తూ తెలంగాణ న్యాయాధికారులు […]

Advertisement
Update: 2016-06-28 03:41 GMT

హైకోర్టు, తెలంగాణ న్యాయవాదుల మధ్య పోరు ఉధృతమవుతోంది. చలో రాజ్‌ భవన్‌లో పాల్గొన్నారంటూ ఇప్పటికే ఇద్దరు న్యాయమూర్తులపై సస్పెన్షన్ వేటు వేసిన హైకోర్టు… తాజాగా మరో తొమ్మిది మందిపై వేటు వేసింది. తెలంగాణ న్యాయాధికారుల సంఘం ఉపాధ్యక్షులు సున్నం శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్‌ ప్రసాద్‌లతో పాటు రమాకాంత్‌, తిరుపతి, రాధాకృష్ణ చౌహా తదితరులను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గత నెల 3న ఉమ్మడి హైకోర్టు విడుదల చేసిన ‘ప్రాథమిక కేటాయింపుల జాబితా’ను నిరసిస్తూ తెలంగాణ న్యాయాధికారులు ఆదివారం చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించారు. దీనిపై సోమవారం హైకోర్టు.. తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, కార్యదర్శి వరప్రసాద్‌లను సస్పెండ్‌ చేసింది. తాజగా మరో తొమ్మిది మందిపై న్యాయాధికారులపై సస్పెన్షన్‌ వేటు వేసింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News