మేం అంబటి కంటే ముందే ఉన్నాం... ప్రతోడు సవాల్ చేసేదేనా...

టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారంటూ వస్తున్న ఆరోపణలు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారాయి. అందుకే ఎదురుదాడి ఉధృతం చేశారు. వైసీపీలో ఉన్నన్ని రోజులు జగన్‌కు తాము మంచివాళ్లుగానూ..పార్టీ వీడగానే చెడ్డవాళ్లలా కనిపిస్తున్నామా అని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. జగన్‌ కావాలనే తమపై ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తమను కొనేవాడు ఎవరూ లేరని మోహన్ రెడ్డి చెప్పారు. జగన్‌కు సవాల్ చేసే ముందు భూమానాగిరెడ్డి అద్దంలో ముఖం చూసుకోవాలంటూ అంబటిరాంబాబు చేసిన విమర్శలపైనా మోహన్ […]

Advertisement
Update: 2016-06-17 05:29 GMT

టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారంటూ వస్తున్న ఆరోపణలు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారాయి. అందుకే ఎదురుదాడి ఉధృతం చేశారు. వైసీపీలో ఉన్నన్ని రోజులు జగన్‌కు తాము మంచివాళ్లుగానూ..పార్టీ వీడగానే చెడ్డవాళ్లలా కనిపిస్తున్నామా అని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. జగన్‌ కావాలనే తమపై ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తమను కొనేవాడు ఎవరూ లేరని మోహన్ రెడ్డి చెప్పారు. జగన్‌కు సవాల్ చేసే ముందు భూమానాగిరెడ్డి అద్దంలో ముఖం చూసుకోవాలంటూ అంబటిరాంబాబు చేసిన విమర్శలపైనా మోహన్ రెడ్డి స్పందించారు. అంబటిరాంబాబుకంటే ముందే తమ కుటుంబాలు రాజకీయాల్లో ఉన్నాయని ఆ విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.

మరోవైపు మేం గెలిస్తే వైసీపీని మూసేస్తారా అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలుచేస్తున్న సవాల్‌పై వైసీపీ నేత బొత్ససత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేలు తెలిసే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరోపార్టీలో చేరిన వెంటనే రాజీనామా చేయాల్సిందిపోయి … పార్టీ మూసేస్తారా అంటూ ఎదురు సవాళ్లు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అసలు రాజకీయాలను వీళ్లు ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రోడ్డు మీదకు వెళ్లిన ప్రతోడూ సవాల్‌ చేయడం ఏమిటని ప్రశ్నించారు. సవాల్ అన్న పదానికి వీరికి అర్థం తెలుసా అని బొత్స ప్రశ్నించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News