భార్యల మార్పిడికి ఒత్తిడి " పోలీసులను ఆశ్రయించిన పారిశ్రామికవేత్త కోడలు

భార్యల మార్పిడి. ఇప్పుడు కొన్ని వర్గాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఈ బ్యాడ్ కల్చర్  విస్తరిస్తోంది. భువనేశ్వర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి ఇంట కూడా ఇది బయటపడింది. ఆయన కోడలు ఏకంగా పోలీసులను ఆశ్రయించారు. ఓడిషాలో పేరుగాంచిన పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ్‌ మిశ్రా కోడలు లోపముద్ర మిశ్రా తన భర్త చేతిలో వైఫ్ స్వాపింగ్‌ (భార్యల బదిలీ) వేధింపులకు గురయ్యారు. పెళైన కొద్దికాలానికే ఆమె భర్త వికృత కోరికకోరాడు. పెళ్లయిన కొత్తలో హనీమూన్ కోసం విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ […]

Advertisement
Update: 2016-06-15 23:58 GMT

భార్యల మార్పిడి. ఇప్పుడు కొన్ని వర్గాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఈ బ్యాడ్ కల్చర్ విస్తరిస్తోంది. భువనేశ్వర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి ఇంట కూడా ఇది బయటపడింది. ఆయన కోడలు ఏకంగా పోలీసులను ఆశ్రయించారు. ఓడిషాలో పేరుగాంచిన పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ్‌ మిశ్రా కోడలు లోపముద్ర మిశ్రా తన భర్త చేతిలో వైఫ్ స్వాపింగ్‌ (భార్యల బదిలీ) వేధింపులకు గురయ్యారు. పెళైన కొద్దికాలానికే ఆమె భర్త వికృత కోరికకోరాడు. పెళ్లయిన కొత్తలో హనీమూన్ కోసం విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ వైఫ్ స్వాపింగ్‌కు ఆమె భర్త ఒత్తిడి తెచ్చారు. అయితే ఈ విషయం ఇప్పుడు ఆలస్యంగా ఆమె బయటపెట్టారు.

కుటుంబ గౌరవం కోసం ఇంతకాలం ఈ విషయాన్ని బయటపెట్టలేదని అయితే రానురాను భర్త, అత్తమామల నుంచి వేధింపులు మరింత అధికమయ్యాయని ఆమె వాపోయారు. తనకు వారి నుంచి ప్రాణహాని కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా రోజుల కిందట వేధింపుల గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆమె మీడియా ముందు ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష వైఖరిపై నగర డీసీపీ సత్యబ్రొతొ భొయి స్పందించారు. లోపముద్ర ఆరోపణల నేపథ్యంలో తక్షణమే చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News