ట్రైన్ తగలబెట్టింది పోలీసులే... కసబ్ కంటే దారుణంగా ట్రీట్ చేశారు

ముద్రగడ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును కాపు నేత, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య తీవ్రంగా తప్పుపట్టారు. అసలు తునిలో ట్రైన్ తగలబెట్టింది పోలీసులేనని ఆరోపించారు. మప్టీలో వచ్చిన పోలీసులు ప్రయాణికులను దింపేసి అనంతరం మంట పెట్టారని, దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని  సి. రామచంద్రయ్య అన్నారు. తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిలో కూడా భూములు ఇవ్వని రైతుల తోటలను ప్రభుత్వం పోలీసులచేత తగలబెట్టించిందని అందువల్లే ఇప్పటిదాకా ఆ తోటలను ఎవరు […]

Advertisement
Update: 2016-06-10 04:31 GMT

ముద్రగడ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును కాపు నేత, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య తీవ్రంగా తప్పుపట్టారు. అసలు తునిలో ట్రైన్ తగలబెట్టింది పోలీసులేనని ఆరోపించారు. మప్టీలో వచ్చిన పోలీసులు ప్రయాణికులను దింపేసి అనంతరం మంట పెట్టారని, దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని సి. రామచంద్రయ్య అన్నారు. తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిలో కూడా భూములు ఇవ్వని రైతుల తోటలను ప్రభుత్వం పోలీసులచేత తగలబెట్టించిందని అందువల్లే ఇప్పటిదాకా ఆ తోటలను ఎవరు తగలబెట్టింది తేల్చడంలేదని ఆయన విమర్శించారు.

అటు మాజీ ఎంపీ హర్షకుమార్‌ కూడా ముద్రగడ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆక్షేపించారు. ముద్రగడను ఉగ్రవాది కసబ్ కంటే దారుణంగా ట్రీట్ చేశారని మండిపడ్డారు. రాజమండ్రి ఆస్పత్రిలో ముద్రగడను హర్షకుమార్ పరామర్శించారు. ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేస్తోందని విమర్శించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News