రామ్ చరణ్ సినిమాలో మరో హీరో

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాకు ధ్రువ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈమధ్యే ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. పోలీస్ ఆఫీసర్ గెటప్ లో రామ్ చరణ్ నటిస్తున్న సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా… ఈ సినిమాలో మరో హీరోకు అవకాశం కల్పించారు. అతడే నవదీప్. అవును… సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న నవదీప్ ను చెర్రీ సినిమాలో తీసుకున్నారు. ఓ […]

Advertisement
Update: 2016-06-07 23:02 GMT
ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాకు ధ్రువ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈమధ్యే ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. పోలీస్ ఆఫీసర్ గెటప్ లో రామ్ చరణ్ నటిస్తున్న సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా… ఈ సినిమాలో మరో హీరోకు అవకాశం కల్పించారు. అతడే నవదీప్. అవును… సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న నవదీప్ ను చెర్రీ సినిమాలో తీసుకున్నారు. ఓ కీలక పాత్రను నవదీప్ కు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. గతంలో బాద్ షా సినిమాతో పాటు పలు సినిమాల్లో నవదీప్ కీలక పాత్రలు పోషించాడు. బాద్ షాలో నవదీప్ చేసిన విలనీ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా అలాంటి ఛాయలున్న పాత్రనే సురేందర్ రెడ్డి-చెర్రీ సినిమాలో కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. పైకి నమ్మకంగా ఉంటూనే.. తెరవెనక నమ్మక ద్రోహం చేసే పాత్రలో నవదీప్ కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ పై సోలోగానే సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ సెట్స్ పైకి రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి చేరుకుంది. చెర్రీ-రకుల్ మధ్య వచ్చే రెండు పాటల్ని రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరిస్తారు. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బ్రూస్ లీ తర్వాత చేస్తున్న ఈ సినిమాపై చరణ్ భారీగానే ఆశలు పెట్టుకున్నాడు.
Advertisement

Similar News