నారా రామ్మూర్తినాయుడు, బాలయ్య మానసిక పరిస్థితే నిదర్శనం... దమ్ముంటే చర్చకు రండి

హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును చెప్పుతో కొట్టాలని జగన్ పిలుపునివ్వడంపై మంత్రులు మూకుమ్మడిగా ఎదురుదాడి చేశారు. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని మంత్రులు దేవినేని ఉమా తదితరులు చేసిన విమర్శలకు వైసీపీనేత జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. మానసిక పరిస్థితి సరిగా లేనిది జగన్‌కు కాదని…చంద్రబాబు కుటుంబసభ్యులే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని రమేష్ అన్నారు. ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు తనకు మెంటల్ ఉందని ఐదు ఆస్పత్రుల నుంచి బాలకృష్ణ సర్టిఫికేట్లు తెచ్చింది నిజం కాదా […]

Advertisement
Update: 2016-06-03 02:06 GMT

హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును చెప్పుతో కొట్టాలని జగన్ పిలుపునివ్వడంపై మంత్రులు మూకుమ్మడిగా ఎదురుదాడి చేశారు. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని మంత్రులు దేవినేని ఉమా తదితరులు చేసిన విమర్శలకు వైసీపీనేత జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. మానసిక పరిస్థితి సరిగా లేనిది జగన్‌కు కాదని…చంద్రబాబు కుటుంబసభ్యులే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని రమేష్ అన్నారు.

ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు తనకు మెంటల్ ఉందని ఐదు ఆస్పత్రుల నుంచి బాలకృష్ణ సర్టిఫికేట్లు తెచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. అందుకు సంబంధించి బాలయ్య మెడికల్ సర్టిఫికేట్లను కూడా జోగి రమేష్ మీడియాకు చూపించారు. సీఎం సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కూడా మానసిక వ్యాధితో బాధపడుతున్న మాట వాస్తవం కాదా అని రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబు ఏ విషయాన్నికూడా గంటకు మించి గుర్తుపెట్టుకోవడం లేదని ఆయన సన్నిహితులు వాపోతున్నారని అన్నారు. సైకోల్లాగా ప్రవర్తిస్తున్నది మంత్రులేనని విమర్శించారు. ఎంతో చరిత్ర ఉన్న విజయవాడను రాజకీయ వ్యభిచార కేంద్రంగా మార్చింది చంద్రబాబేనని అన్నారు.

వైసీపీలోని ఎమ్మెల్యేలను రోజుకో పశువు చెప్పున కొంటూ సిగ్గులేకుండా కండువా కప్పుతున్నారని మండిపడ్డారు. రెండేళ్లలో ఏ పని చేయకుండా నవనిర్మాణ దీక్ష అంటూ ఎంతకాలం పాతపాట పాడుతారని ప్రశ్నించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా డెల్టాను ఎండబెట్టిన దేవినేని ఉమ… రాయలసీమకు నీరిస్తానంటూ చెప్పడానికి సిగ్గులేదా అనిప్రశ్నించారు. ఇలాంటి పనులు చేస్తే జనం చెప్పులతోకొట్టరా అని ప్రశ్నించారు జోగిరమేష్. ఉమకు దమ్ముంటే తనతోపాటు కృష్ణా జిల్లా పల్లెల్లోకి రావాలని జోగి రమేష్ సవాల్ విసిరారు. బాలకృష్ణ, నారా రామ్మూర్తినాయుడు మానసిక పరిస్థితిపై టీడీపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని జోగి రమేష్ సవాల్ చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News