ప్రాణాలు తీసుకుంటే గానీ...న్యాయం జరగదా?
అత్యాచారానికి గురయిన అమ్మాయికి… కుటుంబం, గ్రామ పెద్దలు కలిసి మరింత తీవ్రమైన మనస్తాపాన్ని కలిగించి, ఆమె ప్రాణాలు తీసుకునేలా చేశారు. ఉత్తర ప్రదేశ్లోని బాదౌన్ జిల్లా, షాదిపూర్ గ్రామంలో 18 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన 18ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఈ నెల 26న జరిగింది. యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అతను ఇంట్లోకి ప్రవేశించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆమె అరవబోగా తీవ్రంగా కొట్టాడు. మనోశరీరాలు గాయమై కుమిలిపోయిన […]
అత్యాచారానికి గురయిన అమ్మాయికి… కుటుంబం, గ్రామ పెద్దలు కలిసి మరింత తీవ్రమైన మనస్తాపాన్ని కలిగించి, ఆమె ప్రాణాలు తీసుకునేలా చేశారు. ఉత్తర ప్రదేశ్లోని బాదౌన్ జిల్లా, షాదిపూర్ గ్రామంలో 18 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన 18ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఈ నెల 26న జరిగింది. యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అతను ఇంట్లోకి ప్రవేశించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆమె అరవబోగా తీవ్రంగా కొట్టాడు. మనోశరీరాలు గాయమై కుమిలిపోయిన ఆ యువతి తల్లిదండ్రులు రాగానే ఏడుస్తూ జరిగింది చెప్పింది.
యువతి తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఆ యువకుని తల్లిదండ్రులు, పెద్దమనుషుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వాదోపవాదాల అనంతరం అంతా కలిసి పోలీసుల వరకు వెళ్లకుండా సెటిల్మెంట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలు చూస్తూ ఉన్న ఆ అమ్మాయి తీవ్రమైన మనోవేదనకు గురయింది. స్వయంగా కన్నతల్లిదండ్రులు మరొకసారి అన్యాయం చేయటం ఆమె తట్టుకోలేకపోయింది. తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంది. ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. శనివారం ఆమె శరీరం ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించింది. కూతురు మరణించాక ఆమె తల్లిదండ్రులు పోలీసుల వద్దకు వెళ్లారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేశారు. ఈ విషయాలను వెల్లడించిన పోలీసులు, నిందితుడిపై వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి, అరెస్టు చేసినట్టుగా తెలిపారు. నేరం చేసినవాడి క్రూరత్వమే కాదు, తల్లిదండ్రులు, గ్రామపెద్దల మూర్ఖత్వం కూడా ఆమె తన ప్రాణాలను తీసుకునేలా చేసింది.