చంద్ర‌బాబుకు చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం కాదు.. ఆయ‌న్నే వెళ్లి అడ‌గండి

చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ పార్టీ ఎస్సీ నాయకులపై రుసరుసలాడారు. చిత్తూరులో జరిగిన టీడీపీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో నాయకులపై ఆయన వీరావేశం చూపించారు‌. ఈ సమావేశంలో నియోజకవర్గ ఎస్సీనాయకులు తమకు పదవులు కావాలని కోరగా వెంటనే శివప్రసాద్ కోపం కట్టలు తెంచుకుంది. “పార్టీలో పని చేస్తున్న ప్రతి ఎస్సీ నాయకుడికీ, కార్యకర్తకు పదవులు ఇవ్వలేం.. మీరు ముఖ్యమంత్రి చంద్రబాబునే అడగండి” అని నాయకులపై మండిపడ్డారు. “ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు పదవులు అడగవచ్చు కదా…. ఆయన ఇక్కడికి […]

Advertisement
Update: 2016-05-18 10:49 GMT

చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ పార్టీ ఎస్సీ నాయకులపై రుసరుసలాడారు. చిత్తూరులో జరిగిన టీడీపీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో నాయకులపై ఆయన వీరావేశం చూపించారు‌. ఈ సమావేశంలో నియోజకవర్గ ఎస్సీనాయకులు తమకు పదవులు కావాలని కోరగా వెంటనే శివప్రసాద్ కోపం కట్టలు తెంచుకుంది. “పార్టీలో పని చేస్తున్న ప్రతి ఎస్సీ నాయకుడికీ, కార్యకర్తకు పదవులు ఇవ్వలేం.. మీరు ముఖ్యమంత్రి చంద్రబాబునే అడగండి” అని నాయకులపై మండిపడ్డారు. “ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు పదవులు అడగవచ్చు కదా…. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఉపన్యాసాలకు చప్పట్లు కొట్టడం మాత్రమే తెలుసా..? ఆయన్ని ఎందుకు ప్రశ్నించరు… మమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నారు… ఆయన దగ్గరికి వెళ్లి అడిగి తీసుకోండి పదవులు” అంటూ నాయ‌కుల‌పై శివ‌ప్ర‌సాద్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తమ వర్గానికే చెందిన నాయకుడు ఇలా త‌మ‌పై చిందులేయ‌డం చూసి ఎస్సీ నాయ‌కులు ఆవేద‌న చెందారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిన‌ప్ప‌టికీ ఎటువంటి పదవులు ఇవ్వకుండా, పార్టీకి ఎంతో సేవ చేసిన తమని ఇలా అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News