ఒక సామాజికవర్గంపై కంచె ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు

ఒక సమాజిక వర్గంపై ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సదరు సామాజికవర్గం వారు తిని కూర్చునే సోమరులని వ్యాఖ్యానించారు. వారు చదివే మంత్రాలు ఎవరికైనా అర్థం అవుతాయా అని ప్రశ్నించారు. ఏనాడైనా సదరు సామాజికవర్గం నాగలిపట్టి దున్ని పంటలుపండించిందా అని అన్నారు. రాజధాని పేరు అమరావతి అని పెట్టారని అది బుద్ధుడికి సంబంధించిన పేరు అన్నారు. బుద్ధుడితో ఆర్‌ఎస్‌ఎస్ కు బద్ధ విరోధం అన్నారు. అందుకు ఏపీరాజధాని నిర్మాణానికి నరేంద్రమోదీ డబ్బులు ఇవ్వడం లేదని […]

Advertisement
Update: 2016-05-14 23:36 GMT

ఒక సమాజిక వర్గంపై ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సదరు సామాజికవర్గం వారు తిని కూర్చునే సోమరులని వ్యాఖ్యానించారు. వారు చదివే మంత్రాలు ఎవరికైనా అర్థం అవుతాయా అని ప్రశ్నించారు. ఏనాడైనా సదరు సామాజికవర్గం నాగలిపట్టి దున్ని పంటలుపండించిందా అని అన్నారు. రాజధాని పేరు అమరావతి అని పెట్టారని అది బుద్ధుడికి సంబంధించిన పేరు అన్నారు.

బుద్ధుడితో ఆర్‌ఎస్‌ఎస్ కు బద్ధ విరోధం అన్నారు. అందుకు ఏపీరాజధాని నిర్మాణానికి నరేంద్రమోదీ డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాజధాని శంకుస్థాపన చేసిన చోట బుద్ధుడి విగ్రహం ఎందుకు పెట్టలేదని ఐలయ్య ప్రశ్నించారు. బహు భార్యలతో ఉన్న శ్రీకృష్ణుడు సమాజానికి ఆదర్శ పురుషుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాముడు ఆదివాసుల నాయకురాలు తాటకిని చంపారని విమర్శించారు. ఎంతో అందగత్తె అయిన శూర్పణఖ ముక్కుచెవులను లక్ష్మణుడు కోశాడని.. ఇలాంటి వారు ఆరాధ్యులు ఎలా అవుతారని ప్రశ్నించారు. విజయవాడలో సీపీఎం నేతలు పర్సా సత్యనారాయణ, నండూరి ప్రసాదరావు సంస్మరణార్థం జరిగిన దేశభక్తి- భిన్న ధృక్పథాలు అన్న కార్యక్రమంలో ఐలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News