రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చిన లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తమపై జగన్ చేస్తున్న అవినీతి ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు. ఏడేళ్లుగా తమ కుటుంబం ఆస్తులను ఏటా ప్రకటిస్తోందని జగన్ ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. జగన్‌కు ఢిల్లీలో ఎవరూ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. రాజ్యసభ బరిలో నాలుగో అభ్యర్థిని దింపడంపై అధినేతే నిర్ణయం తీసుకుంటారని లోకేష్ చెప్పారు. తాను మంత్రి వర్గంలో […]

Advertisement
Update: 2016-04-28 04:04 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తమపై జగన్ చేస్తున్న అవినీతి ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు. ఏడేళ్లుగా తమ కుటుంబం ఆస్తులను ఏటా ప్రకటిస్తోందని జగన్ ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. జగన్‌కు ఢిల్లీలో ఎవరూ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు.

రాజ్యసభ బరిలో నాలుగో అభ్యర్థిని దింపడంపై అధినేతే నిర్ణయం తీసుకుంటారని లోకేష్ చెప్పారు. తాను మంత్రి వర్గంలో చేరడం లేదని చెప్పారు. ఆ వార్తలన్నీ అవాస్తవం అని చెప్పారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నానని లోకేష్ వెల్లడించారు. తనపై చేసిన ఆరోపణపై జగన్ బహిరంగ చర్చకు రావాలని లోకేష్ సవాల్ విసిరారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News