దేవినేని ఉమా పెద్ద దద్దమ్మట!

తెలంగాణ నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైసీపీ నేత జోగి రమేష్ మండిపడ్డారు. కృష్టా డెల్టా ఏడారి అవుతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా 150 టీఎంసీల నీటిని తెలంగాణ తరలించుకుపోతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. సొంత బలహీనత కారణంగా కేంద్రం, కేసీఆర్ వద్ద చంద్రబాబు గంగిరెద్దులా మారిపోయాడని విమర్శించారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కృష్ణా ట్రిబ్యునల్‌కు ఎందుకు ఫిర్యాదు […]

Advertisement
Update: 2016-04-17 02:15 GMT

తెలంగాణ నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైసీపీ నేత జోగి రమేష్ మండిపడ్డారు. కృష్టా డెల్టా ఏడారి అవుతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా 150 టీఎంసీల నీటిని తెలంగాణ తరలించుకుపోతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. సొంత బలహీనత కారణంగా కేంద్రం, కేసీఆర్ వద్ద చంద్రబాబు గంగిరెద్దులా మారిపోయాడని విమర్శించారు.

తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కృష్ణా ట్రిబ్యునల్‌కు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని జోగి రమేష్ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుకు భయపడే కేసీఆర్‌ ఏం చేస్తున్నా చంద్రబాబు మాట్లాడడం లేదని ఆరోపించారు. ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ఒక పెద్ద దద్దమ్మ అని జోగి రమేష్ విమర్శించారు. ప్రెస్‌మీట్లు పెట్టి సొల్లు కబుర్లు చెప్పడం తప్పా దేవినేని ఉమాకు ఏదీ చేతకాదని ఎద్దేవా చేశారు. ఏపీకి అన్యాయం చేసే ప్రాజెక్టుల నిర్మాణాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోందన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News